జూబ్లీహిల్స్,జూలై17: క్రీడలకు ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని, క్రీడాకారులకు కల్పిస్తున్న సౌకర్యాలను సద్వినియోగం చేసుకోవాలని టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ సూచించారు. మంత్రి కేటీఆర్ జన్మదిన వేడుకల సందర్భంగా నిర్వహించనున్న జూబ్లీహిల్స్ నాకౌట్ క్రికెట్ టోర్నీ కోసం రహ్మత్నగర్ డివిజన్లో భారీ క్రీడా మైదానం సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు. ఆదివారం హెచ్ఎఫ్నగర్ క్వారీ ల్యాండ్లో సుమారు 5 ఎకరాల స్థలంలో రూ. కోటి 95 లక్షలతో ఏర్పాటు చేస్తున్న ప్లే గ్రౌండ్ పనులను కార్పొరేటర్ సీఎన్ రెడ్డితో కలిసి ప్రారంభించారు.
ఇప్పటికే 136 జట్లు పాల్గొన్న డివిజన్ వారీ లీగ్ పోటీల తుది పోరుకోసం 7 డివిజన్లలో గెలిచిన విన్నర్స్, రన్నర్స్ జట్లకు ఈనెల 20 నుంచి నాలుగు రోజులపాటు నిర్వహించే ఫైనల్స్ పోటీలకు ఈ భారీ క్రీడా మైదానం అందుబాటులోకి తీసుకురానున్నట్లు తెలిపారు. ఈ పోటీల్లో విజేతకు రూ.2 లక్షలు, రన్నర్స్కు రూ. లక్ష, మూడు, నాలుగు స్థానాల్లో నిలిచిన జట్లకు రూ.50 వేల చొప్పున బహుమతులివ్వనున్నట్లు తెలిపారు. అన్ని సౌకర్యాలతో ఏర్పాటు చేయనున్న ఈ క్రీడా మైదానం రహ్మత్నగర్, బోరబండ చుట్టూపక్కల ప్రాంతాల క్రీడాకారులకు ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ డివిజన్ అధ్యక్షుడు మన్సూర్, కార్యదర్శి శ్రీనివాస్ పాల్గొన్నారు.