గోల్నాక, జూలై 2: లబ్ధిదారులు దళిత బంధు పథకాన్ని సద్వినియోగం చేసుకొని ఆర్థికంగా ఎదగాలని ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ కోరారు. దళితుల కుటుంబాల్లో వెలుగులు నింపేందుకే సీఎం కేసీఆర్ దళిత బంధు పథకాన్ని అమలు చేస్తున్నారని తెలిపారు. శనివారం గోల్నాకలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో బాగ్అంబర్పేట డివిజన్కు చెందిన కన్వేట శ్రీనివాస్కు దళిత బంధు పథకం కింద మంజూరైన రూ.10 లక్షల విలువ చేసే కారును ఆయన అందజేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ..దేశంలో ఎక్కడా లేని విధంగా దళితులను కోటీశ్వరులను చేయడమే తెలంగాణ ప్రభుత్వ లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు. అన్ని వర్గాలు అభివృద్ధి సాధించాలనే లక్ష్యంతో సీఎం కేసీఆర్ ఆయా వర్గాల వారికి సంక్షేమ పథకాలు అందిస్తున్నట్లు ఆయన తెలిపారు.
దళిత బంధు పథకం నిరంతర ప్రక్రియ అని, అర్హులైన ప్రతి దళిత కుటంబానికి పతకం వర్తింపజేస్తామని ఆయన స్పష్టం చేశారు.. అంబర్పేట నియోజకవర్గంలో పైలెట్ ప్రాజెక్ట్ కింద ముందుగా వంద మంది లబ్ధిదారులకు యూనిట్లు అందజేశామన్నారు. రెండో విడతలో త్వరలోనే 15వందల మంది కుటుంబాలకు పథకం వర్తింపజేస్తున్నామని తెలిపారు. అర్హులైన ప్రతి దళిత కుటుంబానికీ పథకం ప్రయోజానాన్ని అందిస్తామని ఆయన తెలిపారు. ఈ విషయంలో ఎలాంటి అపోహలకు గురి కావద్దని ఆయన సూచించారు. లబ్ధిదారులు దళిత బంధు పథకాన్ని సద్వినియోగం చేసుకొని ఆర్థికంగా ఎదగడంతో పాటు జీవితంలో స్థిరపడాలన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక టీఆర్ఎస్, దళిత సంఘాల నాయకులు పాల్గొన్నారు.