ఎల్బీనగర్ జోన్బృందం, జూలై 2: రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్ సిన్హాకు స్వాగతం పలికేందుకు ఎల్బీనగర్ టీఆర్ఎస్ శ్రేణులు కదం తొక్కారు. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ ఆదేశాలతో ఎల్బీనగర్ నియోజకవర్గం ఎమ్మెల్యే, ఎంఆర్డీసీ చైర్మన్ దేవిరెడ్డి సుధీర్రెడ్డి ఆధ్వర్యంలో ఎల్బీనగర్ నియోజకవర్గం పార్టీ శ్రేణులు భారీ బైక్ ర్యాలీతో బేగంపేట్ ఎయిర్పోర్టుకు తరలివెళ్లారు. నాగోలులోని ఈవెంట్విల్లా ఫంక్షన్ హాల్ వద్ద ఒక్కో డివిజన్ నుంచి సుమారు 100 బైక్లతో మొత్తం 11 డివిజన్లలో 1100 బైక్లతో గులాబీదళం కదిలివెళ్లింది. ఎల్బీనగర్ ఎమ్మెల్యే, ఎంఆర్డీసీ చైర్మన్ దేవిరెడ్డి సుధీర్రెడ్డి జెండా ఊపి బైక్ ర్యాలీని ప్రారంభించి ర్యాలీలో బైక్పై ప్రయాణించారు.
ఎమ్మెల్సీలు ఎగ్గె మల్లేశం కురుమ, బొగ్గారపు దయానంద్ గుప్తా, టీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు, మాజీ కార్పొరేటర్లు, పార్టీ శ్రేణులు పెద్ద సంఖ్యలో బైక్లపై ర్యాలీగా వెళ్తుంటే ఇన్నర్ రింగ్రోడ్డు పూర్తిగా గులాబీమయంగా మారింది. యశ్వంత్సిన్హాకు మద్దతుగా కొత్తపేట చౌరస్తాతో పాటు మోహన్నగర్ చౌరస్తా, నాగోలు ప్రాంతాల్లో వెలిసిన ఫ్లెక్సీలతో పాటు పార్టీ జెండాలతో ఈ ప్రాంతం అంతా గులాబీ గుబాలింపుతో కళకళలాడింది. బేగంపేట్ ఎయిర్పోర్టులో యశ్వంత్ సిన్హాను స్వాగతం పలికిన అనంతరం సీఎం కేసీఆర్తో కలిసి జలవిహార్ వరకు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో కలిసి టీఆర్ఎస్ శ్రేణుల బైక్ ర్యాలీ జలవిహార్ వరకు సాగింది.
ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్లు ముద్రబోయిన శ్రీనివాస్రావు, కొప్పుల విఠల్రెడ్డి, జిట్టా రాజశేఖర్రెడ్డి, సామ తిరుమల్రెడ్డి, వజీర్ ప్రకాశ్గౌడ్, ప్రవీణ్కుమార్, జీవీ సాగర్రెడ్డి, రమావత్ పద్మానాయక్, డివిజన్ల టీఆర్ఎస్ అధ్యక్షులు లింగాల రాహుల్గౌడ్, కటికరెడ్డి అరవింద్రెడ్డి, చింతల రవికుమార్ గుప్తా, తోట మహేశ్యాదవ్, జక్కల శ్రీశైలం యాదవ్, వరప్రసాద్రెడ్డి, చెన్నగోని శ్రీధర్ గౌడ్, సత్యం చారి, రాజిరెడ్డి, చిరంజీవి, అనంతుల రాజారెడ్డి, కుంట్లూరు వెంకటేశ్గౌడ్, జి.సతీశ్యాదవ్, దూగుంట్ల నరేశ్, చంద్రశేఖర్రెడ్డి, జగదీశ్ యాదవ్, రాజు గౌడ్, ఉద్యమకారులు, పార్టీ శ్రేణులు, మహిళా విభాగం నాయకురాళ్లు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.