బండ్లగూడ,జూలై 2: రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్ సిన్హాకు స్వాగతం పలికేందుకు బేగంపేట విమానాశ్రయానికి రాజేంద్రనగర్ నుంచి టీఆర్ఎస్ శ్రేణులు భారీగా తరలి వెళ్లారు. రాజేంద్రనగర్ డివిజన్ ధర్మారెడ్డి ఆధ్వర్యంలో బైక్ ర్యాలీగా వెళ్లారు. కార్యక్రమంలో మహేశ్, జాన్పాల్, శివగౌడ్, శరత్, దేవేందర్, నర్సింగ్, రాజుగౌడ్ తదితరులు పాల్గొన్నారు.
బైక్ ర్యాలీగా బేగంపేటకు ..
సైదాబాద్, జూలై 2 : రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్ సిన్హా నగరానికి విచ్చేసిన సందర్భంగా స్వాగతం పలకటానికి మలక్పేట, యాకుత్ఫురా నియోజకవర్గాల నుంచి టీఆర్ఎస్ శ్రేణులు పెద్ద ఎత్తునతరలివెళ్లారు.మలక్పేట నియోజకవర్గం నుంచి టీఆర్ఎస్ నియోజకవర్గం ఇన్చార్జి అజం అలీ, యాకుత్పురా నియోజవర్గం ఇన్చార్జి సామ సుందర్ రెడ్డి ఆధ్వర్యంలో బైక్ ర్యాలీగా బేగంపేటకు తరలివెళ్లారు. సైదాబాద్, అక్బర్బాగ్, మూసారాంబాగ్, అజంపురా, చావునీ, పాతమలక్పేట డివిజన్లతోపాటు యాకుత్ఫురా నియోజకవర్గం పరిధిలోని ఐఎస్ సదన్, కుర్మగూడ, సంతోష్నగర్, గౌలిపురా, రైయిన్ బజార్ల డివిజన్లకు చెందిన టీఆర్ఎస్ కార్యకర్తలు సంతోష్నగర్ చౌరస్తాలోని మందీర్ – మసీదు వద్దకు పార్టీ శ్రేణులందరూ సమావేశమై వారంతా భారీగా బైక్ ర్యాలీగా బేగంపేట విమానాశ్రయానికి తరలివెళ్లారు. హైదరాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ కొరుడు భూమేశ్వర్ ఆధ్వర్యంలో సైదాబాద్ డివిజన్ నుంచి వివిధ ప్రాంతాల నుంచి బేగంపేటకు వెళ్లారు. టీఆర్ఎస్ నాయకులు మైల్కోల్ మహేందర్, కావేటి ధర్మరాజు, కుర్మగూడ, ఐఎస్ సదన్ సైదాబాద్ డివిజన్ల టీఆర్ఎస్ అధ్యక్షులు దర్శనం నర్సింగ్ రావు, మెట్టు భాస్కర్ రెడ్డి, పగిళ్ల శ్రీనివాస్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి లక్ష్మణ్ సింగ్ ఠాకూర్ పాల్గొన్నారు.
మలక్పేట నియోజకవర్గం నుంచి..
చాదర్ఘాట్, జూలై 2 : సిన్హా కు స్వాగతం పలికేందుకు మలక్పేట నియోజకవర్గం నుంచి టీఆర్ఎస్ ఇన్చార్జి ఆజం అలీ నేతృత్వంలో ఆజంపురా కార్యాలయం నుంచి బైక్ ర్యాలీగా వెళ్లారు. ఎయిర్పోర్టు నుంచి జల్విహార్కు ర్యాలీగా వెళ్లారు.