మియాపూర్, జూలై 1 : వైకల్యం ప్రతిభకు ఏమాత్రం ఆటంకం కాదని ఆత్మైస్థెర్యంతో ముందడుగేయాలని విప్ అరెకపూడి గాంధీ కోరారు. దివ్యాంగులను ప్రేమతో ఆదరించాలని తగు తోడ్పాటును అందించాలని పిలుపునిచ్చారు. జీహెచ్ఎంసీ అలింకో సంయుక్తంగా దివ్యాంగుకలకు, వయోవృద్ధులకు ఉచితంగా ఉపకరణాల పంపిణీ నిమిత్తం అర్హులైన వారిని గుర్తించేందుకు చందానగర్ సర్కిల్ కార్యాలయ ఆవరణలోని అంబేద్కర్ కల్యాణ మండపంలో శుక్రవారం శిబిరాన్ని నిర్వహించారు. కార్పొరేటర్లు మంజులరెడ్డి, జగదీశ్ గౌడ్, ఉప్పలపాటి శ్రీకాంత్లతో కలిసి విప్ గాంధీ శిబిరాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దివ్యాంగుల సంక్షేమం కోసం ప్రభుత్వం తగు కృషి చేస్తున్నదని, ఆసరా పెన్షన్లు సహా ఇతర తోడ్పాటును అందిస్తున్నదన్నారు.
దివ్యాంగులు సమాజంలో అందరితో సమానమేనని, ప్రతి ఒక్కరు వారికి చేయూతనందిస్తూ తమ వైకల్యాన్ని మరిచిపోయేలా చేయాలన్నారు. సామాజిక కార్యక్రమంలో భాగంగా ఉచితంగా ఉపకరణాలను అందించటం అభినందనీయమని గాంధీ పేర్కొన్నారు. ఈ నెల 7వ తేదీన హైదర్నగర్ డివిజన్ హెచ్ఎంటీ హిల్స్ కమ్యూనిటీహాల్లో ఈ శిబిరాన్ని నిర్వహిస్తారని అర్హులైన వారంతా సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. శిబిరాల వద్ద తగు సౌకర్యాలు కల్పించాలన్నారు. ఈ కార్యక్రమంలో స్టేట్మిషన్ కోఆర్డినేటర్ సుజాత, పీవో ఉషారాణి, మెప్మా డీఎం భానుప్రకాశ్, పార్టీ డివిజన్ అధ్యక్షులు రఘునాథ్రెడ్డి, శ్రీనివాస్యాదవ్, కర్ణాకర్, శ్రీనివాస్, రాంచందర్, రఘునాథ్, వెంకటేశ్, నాగరాజు, నరేందర్, వరలక్ష్మీ, పాషా, కొండల్రెడ్డి, కార్తిక్, యశ్వంత్, సందీప్ పాల్గొన్నారు.
సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి
మాదాపూర్, జూలై 1: మాదాపూర్ డివిజన్ పరిధిలోని వైశాలి నగర్ కాలనీలో నెలకొన్న సమస్యలను ఎమ్మెల్యే, విప్ అరెకపూడి గాంధీ, కార్పొరేటర్ వి. జగదీశ్వర్ గౌడ్తో పాటు జలమండలి, ఇంజినీరింగ్ అధికారులతో కలిసి శుక్రవారం పరిశీలించారు. ఈ కార్యక్రమంలో జీహెచ్ఎంసీ ఇంజినీరింగ్ విభాగం ఏఈ ప్రతాప్, జలమండలి డీజిఎం నాగప్రియ, మేనేజర్ మానస, మాదాపూర్ డివిజన్ అధ్యక్షుడు ఎర్రగుడ్ల శ్రీనివాస్ యాదవ్ పాల్గొన్నారు.