బంజారాహిల్స్, జూలై 1: టీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి పనులపై చర్చించేందుకు దమ్ములేని ప్రతిపక్ష పార్టీలు కేవలం ముఖ్యమంత్రి కేసీఆర్ మీద విమర్శ లు చేయడమే పనిగా పెట్టుకున్నారని ఎమ్మెల్యే దానం నాగేందర్ ఆరోపించారు. జూబ్లీహిల్స్ డివిజన్ పరిధిలోని బసవతారకం నగర్ బస్తీకి చెందిన కాంగ్రెస్, బీజేపీ పార్టీలకు చెందిన పలువురు కార్యకర్తలు బస్తీ అధ్యక్షుడు ఒర్సు శ్రీను ఆధ్వర్యంలో టీఆర్ఎస్లో చేరారు. శుక్రవారం ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ పార్టీలో చేరిన వారికి గులాబీ కండువాలు కప్పి స్వాగతం పలికారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే దానం మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ర్టాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పథకంలో తీసుకువెళ్తున్న టీఆర్ఎస్ ప్రభుత్వానికి మద్దతు పలికేందుకు ఇతర పార్టీలనుంచి కార్యకర్తలు టీఆర్ఎస్లోకి వస్తున్నారని అన్నారు. టీఆర్ఎస్తోనే అభివృద్ధి సాధ్యమని అన్ని పార్టీల నాయకులు బలంగా నమ్ముతున్నారని అన్నారు. టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో అభివృద్ధి గురించి మాట్లాడేందుకు ప్రతిపక్ష పార్టీలకు ధైర్యం లేదని, కేవలం ముఖ్యమంత్రి మీద నోటికొచ్చినట్లు మాట్లాడడమే పనిగా పెట్టుకున్నారన్నారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు మామిడి నర్సింగరావు, ఓర్సు శ్రీను, టీఆర్ఎస్ డివిజన్ అధ్యక్షుడు చంద్రశేఖర్, మైనార్టీ అధ్యక్షుడు అబ్దుల్ ఘణీ, అబ్దుల్ వాహెద్, గండికోట శంకర్, హసన్ అలీ తదితరులు పాల్గొన్నారు.
దేశానికే ఆదర్శంగా దళితబంధు..
దళితుల జీవితాల్లో మార్పును తీసుకువచ్చేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెట్టిన దళితబంధు పథకం దేశానికే ఆదర్శమని ఎమ్మెల్యే దానం నాగేందర్ అన్నారు. ఫిలింనగర్లోని బీజేఆర్నగర్లో శుక్రవారం దళితబంధు పథకం లబ్ధిదారులకు సెంట్రింగ్ సామగ్రి, కార్లు అందజేసేందుకు ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎమ్మెల్యే ల్గొన్నారు. బీజేఆర్నగర్కు చెందిన వెంకటేశ్, ఎల్లయ్య, ఏడుకొండలు తదితరులకు దళితబంధు కింద లబ్ధిచేకూరిందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. పేదరికంతో బాధపడుతున్న వారికి ప్రభుత్వ పరంగా సాయం అందిస్తే ఆర్థికంగా నిలదొక్కుకుంటారనే గొప్ప ఆలోచనతో ముఖ్యమంత్రి కేసీఆర్ దళితబంధు పథకాన్ని ప్రారంభించారన్నారు.
తొలివిడతలో నియోజకవర్గంలో 100మందిని ఎంపిక చేయడం జరిగిందని, రెండో విడతలో మరో 1,000మందికి దళితబంధు అందిస్తామని పేర్కొన్నారు. ఇలాంటి పథకం దేశంలో ఏ రాష్ట్రంలోనూ లేదని, తెలంగాణ పథకాలన్నీ దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయన్నారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు మామిడి నర్సింగరావు, చంద్రశేఖర్, ఘని, రాములమ్మ, దామోదర్, నడిమింటి కృష్ణ, ప్రభాకర్, పద్మ, ధనమ్మ. దయ్యాల దాసు, లక్ష్మణ్, కృష్ణ తదితరులు పాల్గొన్నారు.