ఘట్కేసర్,జూలై 1 : ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు సౌకర్యాలు కల్పించి కార్పొరేట్కు దీటుగా సీఎం కేసీఆర్ తీర్చిదిద్దుతున్నారని పోచారం చైర్మన్ బి.కొండల్రెడ్డి అన్నారు. మున్సిపాలిటీ పరిధిలోని అన్నోజిగూడ, ఎల్ఎన్ కాలనీ, యంనంపేట్, నారపల్లి ప్రభుత్వ పాఠశాలల్లో చైర్మన్ కొండల్రెడ్డి శుక్రవారం విద్యార్థులకు పాఠ్యపుస్తకాలను పంపిణీ చేశారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు ఎలాంటి సమస్యలు లేకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నదని తెలిపారు. ఉపాధ్యాయులు గౌరీశంకర్, శంకర్, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.
ఘట్కేసర్ రూరల్, జూలై 1 : పట్టుదలతో చదివిన ప్రతి విద్యార్థి ఉన్నత శిఖరాలను చేరుకుంటాడని అవుషాపూర్ సర్పంచ్ ఏనుగు కావేరి మశ్చేందర్ రెడ్డి తెలిపారు. అవుషాపూర్ జడ్పీ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు శుక్రవారం పాఠ్యపుస్తకాలను పంపిణీ చేశారు.
మేడ్చల్ రూరల్, జూలై 1 : గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీ పరిధిలోని బాసరేగడి ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు చైర్పర్సన్ మద్దుల లక్ష్మీశ్రీనివాస్ రెడ్డి సమకూర్చిన నోట్ పుస్తకాలను అందజేశారు. వైస్చైర్మన్ ప్రభాకర్, కౌన్సిలర్లు రాజకుమారిసుధాకర్, బాలరాజు, కో ఆప్షన్ సభ్యుడు చిన్నపరెడ్డి, నాయకులు శ్రీనివాస్ రెడ్డి, సుధాకర్, సురేందర్ గౌడ్, ఫిలిప్స్, భాస్కర్, ఐలయ్య, కుమార్, సుధాకర్ పాల్గొన్నారు
మేడ్చల్ కలెక్టరేట్, జూలై 1 : ఎస్బీఐ బ్యాంక్ వార్షికోత్సవం సందర్భంగా నాగారం ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులకు పుస్తకాలను కాప్రా ఎస్బీఐ బ్రాంచ్ మేనేజర్ నారాయణ రావు అందజేశారు. టీఆర్ఎస్ నేత శ్రీనివాస్, ప్రధానోపాధ్యాయుడు వెంకటేశం పాల్గొన్నారు.