చర్లపల్లి, జూలై 1: నియోజకవర్గ పరిధిలో నెలకొన్న సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించి ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నామని ఎమ్మెల్యే బేతి సుభాష్రెడ్డి పేర్కొన్నారు. చర్లపల్లి డివిజన్ పరిధిలోని భరత్నగర్లో నెలకొన్న సమస్యలను కాలనీవాసులు శుక్రవారం ఎమ్మెల్యేకు వివరించి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భరత్నగర్లో నివసించే పేద ప్రజలకు వాటర్ వర్క్స్ అధికారులు వేలాది బిల్లులు పంపించినట్లు తన దృష్టికి వచ్చిందని, సమస్యను పరిష్కరించేందుకు అధికారులు చర్యలు తీసుకోవాలని ఆయన ఆదేశాలు జారీ చేశారు. కాలనీలో శిథిలావస్థకు చేరుకున్న మ్యాన్హోల్స్ను తొలగించి నూత నంగా ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామన్నారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు రెడ్డినాయక్, షరీఫ్, సుజాత, సుల్తానా, సుధాకర్, మహ్మద్బద్రుద్దీన్, మహేందర్రెడ్డి, మహేశ్ పాల్గొన్నారు.
సమస్యలు పరిష్కరించాలి
రామంతాపూర్, జూలై1: రామంతాపూర్ డివిజన్లోని బాలకృష్ణానగర్ కుచెందిన క్రిస్టియన్ సొసైటీ 40 ప్రొటెస్టెంట్ సభ్యులు శ్మశాన వాటిక స్థలం కేటాయించాలని కోరుతూ శుక్రవారం ఎమ్మెల్యే బేతి సుభాష్రెడ్డికి వినతి పత్రం ఇచ్చారు.స్పందించిన ఎమ్మెల్యే సంబంధిత అధికారులకు తెలిపారు.కార్యక్రమంలో క్రిస్టియన్ గ్రేవ్యార్డు సొసైటీ రామంతాపూర్ శాఖ అధ్యక్షులు సత్యం, ఉపాధ్యక్షులు ప్రకాశ్ తదితరులు పాల్గొన్నారు.
యువతకు ప్రాధాన్యత ఇస్తాం..
కాప్రా,జూలై1: టీఆర్ఎస్లోని అన్ని విభాగాల్లో యువతకు ప్రాధాన్యత కల్పించేందుకు చర్యలు తీసుకోనున్నట్టు ఎమ్మెల్యే బేతిసుభాష్రెడ్డి అన్నారు. శుక్రవారం ఉప్పల్ టీఆర్ఎస్ మైనార్టీ విభాగం అధ్యక్షులు ఎం.కే.బద్రుద్దీన్ ఎమ్మెల్యే బేతిని కలిసి మైనార్టీ విభాగం బలోపేతానికి తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేను బద్రుద్దీన్ శాలువాతో సత్కరించారు.
మల్లికార్జునస్వామి బ్రహ్మోత్సవంలో పాల్గొన ఎమ్మెల్యే
కాప్రాడివిజన్ బంజారా కాలనీలో శ్రీ దుర్గాదేవి మల్లికార్జునస్వామి ఆలయ వార్షికోత్సవం శుక్రవారం ఘనం గా జరిగింది. ఈవేడుకలోఎమ్మెల్యే సుభాష్రెడ్డి, నగర మాజీ మేయర్ రామ్మోహన్, కాప్రా, ఏఎస్రావునగర్, చర్లపల్లి డివిజన్ల కార్పొరేటర్లు హాజరై ప్రత్యేక పూజలు చేశారు.