మియాపూర్, జూన్ 30 : ప్రజలకు అసౌకర్యం, ట్రాఫిక్కు ఆటంకంగా మారుతున్న నిర్మాణ వ్యర్థాల తొలగింపు ఇక మరింత సులువని ఇందుకోసం అందుబాటులోకి వచ్చిన సేవలను నిర్మాణదారులు సద్వినియోగం చేసుకోవాలని విప్ అరెకపూడి గాంధీ పేర్కొన్నారు. ఒక్క ఫోన్ కాల్ చేసి.. ఇంటి ముందున్న నిర్మాణ వ్యర్థాలను సులువుగా వదిలించుకోవచ్చునన్నారు. భవన నిర్మాణ వ్యర్థాల తరలింపుపై జోనల్ కార్యాలయంలో గురువారం జరిగిన సమీక్షా సమావేశంలో జోనల్ కమిషనర్ శంకరయ్య, డీసీలు వెంకన్న, నందగిరి సుధాంశ్, కార్పొరేటర్లు నాగేందర్యాదవ్, సింధు ఆదర్శ్రెడ్డి, మాజీ కార్పొరేటర్ సాయిబాబాలతో కలిసి విప్ గాంధీ పాల్గొన్నారు. ఇందుకు సంబంధించి ప్రజలలో అవగాహన నిమిత్తం టోల్ ఫ్రీ నంబర్తో రూపొందించిన కరపత్రాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా గాంధీ మాట్లాడుతూ.. జీహెచ్ఎంసీతో కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం రాంకీ సంస్థ నిర్మాణ వ్యర్థాలను జీడిమెట్లలోని డంపింగ్ యార్డుకు తరలిస్తారన్నారు. ఇందుకోసం టోల్ ఫ్రీ నంబరు 1800 -12-1159 నంబరుకు కాల్ చేయాలని, వారే ఇండ్ల వద్దకు వచ్చి భవన నిర్మాణ వ్యర్థాలను తీసుకెళ్తారన్నారు. ఇందుకుగాను టన్నుకు రూ.350 చొప్పున సదరు సంస్థ యజమానుల నుంచి వసూలు చేస్తారన్నారు. నిర్మాణ వ్యర్థాలను కొందరు నాలాల్లో చెరువుల్లో పడేస్తున్నారని, అలాంటి వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈకార్యక్రమంలో ఎస్ఈ శంకర్, ఈఈ శ్రీనివాస్, డీఈలు రమేశ్, స్రవంతి, విశాలాక్షి, ఏఈలు శివప్రసాద్, ప్రతాప్, ప్రశాంత్, రమేశ్, కృష్ణవేణి, సునీల్, అనురాగ్, జీఎం రాజశేఖర్, డీజీఎం నారాయణ పాల్గొన్నారు.
ఉచిత ఉపకరణాలు
జీహెచ్ఎంసీ అలింకో సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో దివ్యాంగులకు, వయో వృద్ధులకు ఉచితంగా సహాయ ఉపకరణాల పంపిణీ నిమిత్తం అర్హులైన వారి ఎంపిక శిబిరాన్ని శేరిలింగంపల్లి జోనల్ కార్యాలయ సమావేశ మందిరంలో గురువారం నిర్వహించారు. జడ్సీ శంకరయ్య, డీసీలు వెంకన్న, కార్పొరేటర్లు రాగం నాగేందర్ యాదవ్, సింధు ఆదర్శ్రెడ్డి, మాజీ కార్పొరేటర్ సాయిబాబాలతో కలిసి విప్ గాంధీ శిబిరాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సహాయ ఉపకరణాలతో మరింత ఊతం లభిస్తుందని, అర్హులైన వారంతా సద్వినియోగం చేసుకోవాలన్నారు. దివ్యాంగుల సంక్షేమం కోసం సీఎం కేసీఆర్ తగు కృషి చేస్తున్నారన్నారు. జూలై 1వ తేదీన చందానగర్ అంబేద్కర్ కల్యాణ మండపంలో, జూలై7న హెచ్ఎంటీ హిల్స్ కమ్యూనిటీహాల్లో తదుపరి శిబిరాలను నిర్వహిస్తారని సద్వినియోగం చేసుకోవాలని విప్ గాంధీ కోరారు. ఈ కార్యక్రమంలో ప్రాజెక్టు ఆఫీసర్ మన్వి, డాక్టర్ నగేశ్, జలంధర్రెడ్డి, మాజీ ప్రజాప్రతినిధులు వీరేశం, రవీందర్, పార్టీ నేతలు రాజు యాదవ్, రఘునాథ్రెడ్డి, శ్రీనివాస్యాదవ్, రవీందర్, రాంబాబు, కృష్ణ, నరేశ్, వినయ్, గోపాల్ పాల్గొన్నారు.