మెహిదీపట్నం, జూన్ 29 : ఆషాఢ మాసం వచ్చిందంటే నగరంలో సందడి మొదలవుతుంది. బస్తీలు, కాలనీలు బోనాల ఉత్సవాలతో కళకళలాడుతాయి. తమ ఇష్టదైవానికి బోనం సమర్పించి మొక్కులు తీర్చుకుంటారు. నగరంలో తొలి బోనం గురువారం చారిత్రక గోల్కొండ కోటలో కొలువైన జగదాంబిక ఎల్లమ్మ అమ్మవారికి సమర్పణతో ఉత్సవాలు మొదలవుతాయి. నేటి నుంచి వచ్చేనెల 28వ తేదీ వరకు తొమ్మిదివారాల (గురు,ఆదివారాలు)పాటు ఆషాఢమాస బోనాలను చారిత్రక గోల్కొండ జగదాంబిక ఎల్లమ్మ ఆలయంలో దేవాదాయ శాఖ ఘనంగా నిర్వహించనుంది.
ఉత్సవాలకు సంబంధించి అన్ని ప్రభుత్వ శాఖల అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. గురువారం మధ్యాహ్నం 12 గంటలకు లంగర్హౌస్ చౌరస్తాలో దేవాదాయశాఖ మంత్రి ఇంద్రకరణ్రెడ్డి, పశుసంవర్థకశాఖ మంత్రి తలసాని అమ్మవారికి పట్టువస్ర్తాలు సమర్పించనున్నారు. అనంతరం లంగర్హౌస్ చౌరస్తా నుంచి అమ్మవారి పట్టువస్ర్తాలు,తొట్టెల ఊరేగింపుతో జాతర ప్రారంభం అవుతుంది. బుధవారం లంగర్హౌస్,గోల్కొండ ప్రాంతాల్లో వివిధ శాఖల ఉన్నతాధికారులు పర్యటించి ఏర్పాట్లు సమీక్షించారు.
డీఎంహెచ్వో వెంకటి, ఎస్పీడీవో డాక్టర్ అనురాధ, జలమండలి జీఎం నాగేందర్కుమార్, డీజీఎం జవహర్అలీ, పశ్చిమ మండలం డీసీపీ జోయల్డెవిస్, అదనపు డీసీపీ ఇక్బాల్ సిద్ధికీ, ఆసిఫ్నగర్ ఏసీపీ శివమారుతి, గోల్కొండ ఇన్స్పెక్టర్ చంద్రశేఖర్రెడ్డిలు పరిశీలించారు. కరోనా అనంతరం పూర్తిస్థాయిలో గోల్కొండ బోనాల జాతర జరుగుతుండడంతో రాష్ట్రం నలుమూలల నుంచి లక్షలాదిమంది తరలివచ్చే అవకాశాలు ఉన్నాయని, ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నామని జగదాంబిక ఎల్లమ్మ ఆలయ ట్రస్టు చైర్మన్ వావిలాల మహేశ్వర్ తెలిపారు.
బోనాల నేపథ్యంలో ట్రాఫిక్ ఆంక్షలు
సిటీబ్యూరో, జూన్ 29 (నమస్తేతెలంగాణ): గోల్కొండ జగదాంబిక ఎల్లమ్మ బోనాల నేపథ్యంలో 9 వారాల పూజల సందర్భంగా గోల్కొండ ప్రాంతంలో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ఈ ఆంక్షలు పూజలు జరిగే రోజుల్లో ఉదయం 8 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు అమల్లో ఉంటాయి. రాందేవ్గూడ టు గోల్కొండ కోట వయా మక్కీదర్వాజ, లంగర్హౌస్ టు గోల్కొండ వయా ఫతేదర్వాజ, షేక్పేట నాలా, సెవెన్టూంబ్స్ టు గోల్కొండ కోట వయా బంజారాదర్వాజ మార్గంలో ట్రాఫిక్ రద్దీ అధికంగా ఉంటుందని పోలీసులు అంచనా వేస్తున్నారు.
ట్రాఫిక్ మళ్లింపు ఇలా..