సైదాబాద్, జూన్ 28: భారీ వర్షాలు కురుస్తాయని వాతావారణ శాఖ హెచ్చరికలు జారీ చేస్తుండటంతో జీహెచ్ఎంసీ అధికారులు, సిబ్బందిని అప్రమత్తం అయ్యారు. మలక్పేట సర్కిల్ పరిధిలో నెలకొనే పరిస్థితులు చూస్తుంటే వర్షాకాలం వస్తుందంటే అధికారులకు పరీక్ష కాలం. లోతట్టు ప్రాంతాలకు పొంచి ఉన్న ముప్పును పసిగట్టి వాటిని నిరోధించటానికి సహాయచర్యలకు సిద్ధమవుతున్నారు.
యుద్ధ ప్రతిపాదిక చర్యలు..
మలక్పేట అక్షయ్ టిఫెన్ సెంటర్ వద్ద వర్షాకాలంలో తల్తెతే సమస్యలను పరిష్కరించటానికి ఇప్పటికే ప్రత్యేక చర్యలు తీసుకున్నట్లు తెలిసింది. దిల్సుఖ్నగర్ రోడ్పై ట్రాఫిక్ జామ్ అవుతుంది. నాలాల ఆధునీకరణ పనులు చాలమేరకు చివరిస్థాయికి చేరుకోవటంతో ఈసారి సమస్యలు ఉత్పన్నంకావని అధికారులు అంటున్నారు. మాన్షన్ సమస్యలను పరిష్కరించటానికి యాక్షన్ ప్లాన్ సిద్ధం చేశామని జీహెచ్ఎంసీ మలక్పేట డీసీ ఎస్. జయంత్ వాటికి సంబంధించిన వివరాలను వెల్లడించారు.
ముంపు ప్రాంతాల్లో తక్షణం..
శంకేశ్వరబజారులో వరదనీరు ఇండ్లలోకి రాకుండా నాలా ప్రహరీ నిర్మించారు. పలు ప్రాంతాల్లో నాలా పరిసరాల్లో మెష్ ( కంచె)లను ఏర్పాటు చేస్తున్నారు. ఎలాంటి ఇబ్బందులైన ఎదుర్కొవటానికి తాము సిద్దంగా ఉన్నాం, సిబ్బందిని సన్నద్దం చేశాం. సమస్యలు ఏర్పడితే సర్కిల్ – 4 కార్యాలయంలో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూం లో ఫిర్యాదు చేయవచ్చు. మూడు దశలో పని చేసేందుకుగాను మూడు విభాగాలు ఉన్నాయి.
క్షేత్రస్థాయిలో అధికారుల పరిశీలన..
ఏడు మాన్షన్ యాక్షన్ టీమ్లను నియోజకవర్గాల వారీగా ఏర్పాటు చేశారు. ప్రతి టీమ్లో ఏడుగురు కూలీలు, సిబ్బంది ఉంటారు. నాలుగు వాహనాలను సిద్ధం చేసి, ప్రతి వాహనానికి ఏఈ స్థాయి అధికారికి బాధ్యతలను అప్పగించారు. ఎమర్జన్సీ పరిస్థితులను సత్వరమే ఎదుర్కొవటానికి ఇంజనీరింగ్, టౌన్ప్లానింగ్, ఎంట్రాలాజీ, హార్టికల్చర్, పారెస్ట్ అధికారులతో కలిపి ఏసీపీస్థాయి కలిగిన ప్రత్యేక అధికారులను నియమించామని డీసీ అన్నారు.
నాలాల ఆధునీకరణ పనులు ..
39 నాలాల పూడికతీత, ఆధునీకరణ పనులను రూ.40 లక్షల వ్యయంతో పనులను పట్టారు. ఇప్పటికే 37 నాలల పనులు పూర్తి అయినాయి. నాలాల నుంచి తొలగించిన వ్యర్థాలను డప్పింగ్యార్డులకు తొలగిస్తున్నారు. అజంపురా ఆర్వోబీ, మలక్పేట అక్షయ్ టిఫెన్ సెంటర్, జట్పట్నగర్, శంకర్నగర్ నాలా వద్ద ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు.
వర్షాకాలంలో వచ్చే వ్యాధులపై అప్రమత్తం..
సీజనల్ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. కాలనీ సంక్షేమ సంఘాలతోపాటు, సెల్ఫ్హెల్ప్ గ్రూపుల సాయంతో అధికారులు ప్రజల్లో విస్త్రృతంగా ప్రచారం కోనసాగిస్తున్నారు.
దోమల వ్యాప్తి చెందకుండా ఫాగింగ్ చేయటం, నీరు నిల్వ ఉండే ప్రదేశాలను గుర్తించి యాంటీ లర్వా పిచ్చికారిచేస్తున్నారు. మూసీనది పరీవాహక ప్రాంతం, ఓపెన్ నాలాల్లో స్ప్రే చేయించటానికి సన్నద్ధం అయ్యారు. గుర్రపుడెక్క తొలగించే ప్రయత్నాలు జరుగుతున్నాయి.