మల్కాజిగిరి, జూన్ 28: ప్రజల రవాణా సౌకర్యం కోసం చిన్నగా ఉన్న కల్వర్ట్ను తొలగించి బ్రిడ్జి నిర్మిస్తున్నామని ఎమ్మెల్యే మైనంపల్లి హన్మం తరావు అన్నారు. మంగళవారం అల్వాల్ సర్కిల్ వెస్ట్ వెంకటాపురం మెయిన్ రోడ్డులో రూ.1.60కోట్లతో నిర్మిస్తున్న బ్రిడ్జి నిర్మాణ పనులను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. గత రెండు దశాబ్దాల కాలంగా వెస్ట్ వెంకటాపురంతోపాటు ఇతర కాలనీల ప్రజలు కల్వర్ట్ వద్ద వాహనాల రాకపోకలకు ఇబ్బందులు పడ్డారని అన్నారు. ఇక వాహనదారులు ఇబ్బందులు పడకుండా బ్రిడ్జిని నిర్మి స్తున్నామని అన్నారు. నిర్మాణ పనుల్లో నాణ్యతాలోపాలు జరుగకుండా అధికారులు పరిశీలిస్తున్నారని అన్నారు. అధికారులతో నియోజకవర్గంలో సర్వే చేయించి కల్వర్టులను గుర్తించి.. వాటిని బ్రిడ్జిలుగా నిర్మిస్తామని అన్నారు. కార్యక్రమంలో కార్పొరేటర్ సబితాకిశోర్, అనిల్కిశోర్, భాస్కర్, సంతోశ్, ఈఎస్ లక్ష్మణ్, రమేశ్, మల్లేశ్గౌడ్, రాజేశ్గౌడ్, కిట్టు, జనార్దన్, శివ, సూరజ్, మోసిన్, మైవన్, కిశోర్, సుదేశ్, సురేశ్, లోకేశ్, లక్ష్మారెడ్డి, శ్రీనివాస్, మనోజ్, కుట్టి, పద్మావతి, లక్ష్మి, ఉదయ, స్వప్న, జ్యోతి, తదితరులు పాల్గొన్నారు.
టీఆర్ఎస్ ప్రభుత్వంలోనే అభివృద్ధి
గౌతంనగర్, జూన్28 : టీఆర్ఎస్ ప్రభుత్వంలోనే మంచినీటి సమస్యలు లేకుండా పోయాయని ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు అన్నారు. మంగళవారం గౌతంనగర్ డివిజన్, రాజా శ్రీనివాస్నగర్లో వాటర్ పైపులైన్ పనులను కార్పొరేటర్ మేకల సునీతారాముయాదవ్తో కలిసి ఆయన ప్రాంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. టీఆర్ఎస్ ప్రభుత్వంలోనే మంచినీటి కష్టాలు తీరాయని తెలిపారు. ఇంటింటికీ నల్లా నీరందించామని, ఒక్కరూపాయికే నల్లా కనెక్షన్లను అందించి అందరికీ సరిపడేంత మంచినీటిని అందించామన్నారు. నీటి కష్టాలు, కరెంటు ఇబ్బందులు సీఎం కేసీఆర్ తీర్చారని తెలిపారు. టీఆర్ఎస్ ప్రభుత్వం పారదర్శకపాలన అందించి నిరంతరం అభివృద్ధి పథంలోకి తీసుకవచ్చిందని తెలిపారు. కార్యక్రమంలో కార్పొరేటర్ ప్రేమ్కుమార్, జలమండలి జీఎం సునీల్కుమార్, డీజీఎం స్రవంతి, ఈఈ లక్ష్మణ్, డీఈ లౌక్య, ఏఈ దివ్యజ్యోతి, మాజీ కార్పొరేటర్ జగదీశ్గౌడ్, మేకల రాముయాదవ్, కాలనీ అసోసియేషన్ సభ్యులు, టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
అంబేద్కర్నగర్లో అన్నదానం
మల్కాజిగిరి, జూన్ 28: టీఆర్ఎస్ పార్టీతోనే అభివృద్ధి జరుగుతు న్నదని ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు అన్నారు. మంగళవారం మచ్చ బొల్లారం, అంబేద్కర్నగర్లో అంతర్జాతీయ వైశ్య ఫెడరేషన్ ఆధ్వర్యంలో అమావాస్య అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ శ్రీనివాస్గుప్తా, మాజీ మేయర్ బొంతు రామ్మోహన్, కార్పొరేటర్లు రాజ్ జితేంద్రనాథ్, ప్రేమ్కుమార్, గీత, ఆనంద్బాబు, బాలకృష్ణ, వంశీకిశోర్, శ్రీనివాస్గుప్తా, ఎన్. శ్రీనివాస్గుప్తా, మహేశ్, వీరేశం, వెంకటేశం, సురేశ్, చిరంజీవి, శ్రీనివాస్గౌడ్, చంద్రశేఖర్, తదితరులు పాల్గొన్నారు.