సిటీబ్యూరో, జూన్ 27 (నమస్తే తెలంగాణ) : పాలసీదారుడు మృతి చెందినా.. ఇన్సూరెన్స్ కంపెనీ స్పందించకపోవడంతో బాధితులు హైదరాబాద్ వినియోగదారుల కమిషన్-1ను ఆశ్రయించారు. కేసుకు సంబంధించిన సాక్ష్యాలు, ఆధారాలు పరిశీలించిన తర్వాత నామినీకి రూ.50వేల నష్టపరిహారం చెల్లించాలని హెచ్డీఎఫ్సీ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీకి కన్జ్యూమర్ కమిషన్-1 అధ్యక్షురాలు బి.ఉమావెంకట సుబ్బలక్ష్మి, సభ్యురాలు సి.లక్ష్మిప్రసన్నతో కూడిన బెంచ్ ఆదేశించింది. సిద్దిపేటకు చెందిన చీకోటి సంపత్ తన తండ్రి కండక్టర్గా పని చేసే సమయంలో హౌసింగ్లోన్ తీసుకున్నారు. అందులో భాగంగా ‘హోం సురక్షా ప్లస్’ పేరుతో హెచ్డీఎఫ్సీ ఎర్గో జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ ద్వారా వర్తింపజేశారు. అయితే అనారోగ్యంతో 2018 నవంబర్ 29న అతని తండ్రి మృతి చెందాడు. దీంతో కంపెనీ ప్రతినిధులు లోన్ అమౌంట్తో బీమా డబ్బులకు లింక్ పెట్టారు. దీనిపై కమిషన్ను ఆశ్రయించగా హౌసింగ్ లోన్, ఇన్సూరెన్స్ లోన్లను సెటిల్ చేయాలని కమిషన్ ఆదేశించింది. దీంతోపాటు రూ.50వేల నష్టపరిహారాన్ని పాలసీ ప్రకారం నామినీకి చెల్లించాలని, రూ.10వేలు ఖర్చుల కింద అందజేయాలని ఆదేశించింది.