సిటీబ్యూరో, జూన్ 26(నమస్తే తెలంగాణ): ఐటీ కారిడార్లో ట్రాఫిక్ చిక్కులు లేకుండా ప్రత్యామ్నాయ రహదారులపై ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి సారించిం ది. తాజాగా రాయదుర్గం నాలెడ్జ్ సిటీ నుంచి గచ్చిబౌలి-షేక్పేట (పాత ముంబై హైవే)ను కలుపుతూ 120 అడుగుల వెడల్పు కొత్త లింకు రోడ్డును నిర్మించారు. రాయదుర్గం బయోడైవర్సిటీ జంక్షన్ పక్కన ఉన్న భారీ కొండ ప్రాంతాన్ని తొలుస్తూ విశాలమైన రహదారిని నిర్మించారు. దుర్గం చెరువు మీదుగా, ఇనార్బిట్ మాల్ నుంచి మైండ్ స్పేస్ రహేజ్ ఐటీ పార్కు, ఐకియా కూడ లి నుంచి వచ్చే వాహనాలన్నీ నాలెడ్జ్ సిటీ మీదుగా రాయదుర్గం పోలీస్స్టేషన్ ముంబై హైవేను కలిసేలా నిర్మించారు. ఈ ప్రాంతంలో ఇప్పటికే ఉన్న ఐటీ కంపెనీలు, నివాస భవనాలకు తోడు కొత్తగా పదుల సంఖ్య లో బహుళ అంతస్తుల వ్యాపార, వాణిజ్య భవనాలు నిర్మాణంలో ఉన్నాయి. ఇక్కడ నుంచి వచ్చే ట్రాఫిక్ ఒత్తిడి బయోడైవర్సిటీ జంక్షన్ మీద పడకుండా మై హోం భూజ, కొత్తగా ప్రారంభోత్సవం జరుపుకొంటు న్న టీ హబ్ భవనం ఎదురుగా 120 అడుగుల వెడల్పుతో ఈ లింకు రోడ్డును నిర్మించారు.
ప్రత్యేక ఫెన్సింగ్….
ఎత్తయిన గుట్టను చీల్చుతూ ఈ లింకు రోడ్డు ను టీఎస్ఐఐసీ సంస్థ నిర్మాణం చేపట్టింది. ఎత్తయిన గుట్టల మధ్య నుంచి వస్తున్న ఈ మార్గం కొంత ప్రమాదకరంగా ఉన్నట్లుగా రోడ్డు ఇంజినీరింగ్ అధికారులు, ట్రాఫిక్ పోలీసులు సూచించారు. ఈ మేరకు టీఎస్ఐఐసీ అధికారులు భద్ర తా చర్యల్లో భాగంగా ఎత్తయిన కొండల నుంచి మట్టి, రాళ్లు కూలిపడకుండా ఇనుప జాలితో కూడిన ఫెన్సింగ్ను ఏర్పాటు చేశారు. ఈ పనులన్నీ పూర్తి కావడంతో ప్రారంభోత్సవానికి ఏర్పా ట్లు చేస్తున్నారు. ఈ నెల 28న టీహబ్ 2.0 కొత్త భవనాన్ని ప్రారంభిస్తున్న నేపథ్యంలో ఈ లింకు రోడ్డును కూడా ప్రారంభించనున్నారు. ఇది అందుబాటులోకి వస్తే..బయోడైవర్సిటీ జం క్షన్లో ట్రాఫిక్ రద్దీ తగ్గడంతో పాటు మాదాపూ ర్, జూబ్లీహిల్స్ ప్రాంతాల నుంచి వచ్చే వారు నేరు గా రాయదుర్గం మీదుగా మణికొండ, ఔటర్ రింగు రోడ్డు వెళ్లేందుకు సులువుగా మారుతుంది.