మల్కాజిగిరి/గౌతంనగర్,జూన్ 24: మల్కాజిగిరి నియోజకవర్గ అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తున్నామని ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు తెలిపారు. గౌతంనగర్ డివిజన్ పరిధి భవానీనగర్లో శుక్రవారం రూ.22లక్షలతో సీసీ రోడ్డు పనులకు ఎమ్మెల్యే కార్పొరేటర్ మేకల సునీతారాముయాదవ్తో కలిసి శంకుస్థాపన చేశారు. అనంతరం మల్కాగిరి పరిధిలోని మచ్చబొల్లారం కౌకూ రు ఆర్కేడ్ వద్ద తాగునీటి పైపులైన్ నిర్మాణపనులను ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మంత్రి కేటీఆర్ ప్రత్యేక చొరవతో నిధులను మంజూరు చేయడంతో నియోజకవర్గ అభివృద్ధికి నిరంతంర కృషి చేస్తున్నామన్నారు.వరదనీరు, డ్రైనేజీ , రైల్వేగేట్లు, మౌలాలి కమాన్ వంటి సమస్యలను పరిష్కరించామన్నారు.
ఎన్నికల ముందు ఇచ్చిన హమీలకంటే ఎక్కువే అభివృద్ధి చేశామని వివరించారు. అల్వాల్ ప్రజల నీటి కష్టాలు తీర్చడం కోసం రూ.199 కోట్లతో ఇంటింటికీ నల్లా కనెక్షన్లు ఇచ్చామన్నారు. కొత్తగా వెలుస్తున్న కాలనీలకు మౌలిక వసతులు కల్పిస్తున్నామ న్నారు. ఆర్కేనగర్ కాలనీలో పార్కులో మౌలిక వసతులు కల్పిస్తామన్నారు. సీనియర్ సిటిజన్స్కు రీడింగ్ రూం ఏర్పాటు చేయడానికి స్థలాన్ని ఎంపిక చేస్తామన్నారు. భవానీనగర్లో రూ.22లక్షలతో సీసీ రోడ్లు వేస్తున్నామన్నారు.
గౌతంనగర్ డివిజన్లో జరిగిన కార్యక్రమంలో కార్పొరేటర్ ప్రేమ్కుమార్, డిప్యూటీ కమిషనర్ రాజు, ఈఈ లక్ష్మణ్, డీఈ లౌక్య, ఏఈ దివ్యజ్యోతి, జలమండలి డీజీ ఎం స్రవంతి, మాజీ కార్పొరేటర్ జగదీశ్గౌడ్, టీఆర్ఎస్ నాయకులు రాముయాదవ్, కాలనీ అసోసియేషన్ సభ్యు లు, టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు ఉన్నారు. మల్కా జిగిరిలో జరిగిన కార్యక్రమంలో కార్పొరేటర్లు ప్రేమ్కుమార్, సునీతరాము యాదవ్,రాజ్జితేంద్రనాథ్, మాజీ కార్పొరేటర్ జగదీశ్గౌడ్, అధికారప్రతినిధి జీఎన్వీ సతీశ్కుమార్, మీడియా ఇన్చార్జి నిరంజన్, రాముయాదవ్, శ్రీనివాస్, నర్సింగ్రావు, మోహన్రెడ్డి, సంతోష్రాందాస్, సంధ్య,వసంత, సోమశేఖర్, రాఘవేంద్ర, రవికిరణ్, సంజయ్, సాయినాథ్, ప్రేమ్కుమార్, పరమేశ్, రాజేశ్, శోభన్ బాబు, మహంతి, శశిధర్, కవిత ఉన్నారు.
అభివృద్ధి పనులు.. ఎమ్మెల్యే పరిశీలన
అల్వాల్/నేరేడ్మెట్,జూన్ 24:నేరేడ్మెట్ డివిజన్ యాప్రాల్ నాగిరెడ్డి చెరువు సమీపంలో రూ.41కోట్లతో జరుగుతున్న ఎస్ఎన్డీపీ నిర్మాణ పనులను ఎమ్మెల్యే హన్మంతరావు, అధికారులతో కలిసి శుక్రవారం పరిశీలించారు. అదేవిధంగా అల్వాల్ డివిజన్ శ్రీబేకరీ వద్ద నిర్మిస్తు న్న బాక్స్ డ్రైన్ నిర్మాణపనులన ఎమ్మెల్యే పరిశీలించారు. కార్యక్రమంలో సర్కిల్ ఉపాధ్యక్షుడు ఉపేందర్రెడ్డి, సతీష్కుమార్, నిరంజన్, ఎస్ఆర్ ప్రసాద్,కార్పొరేటర్ శాంతి శ్రీనివాస్ రెడ్డి, డీఈ పవన్, డీజీఎం సునీల్, మేనేజర్ మల్లికార్జున్, ఉదయ్, బలవంత్రెడ్డి, నాగేశ్వరావు, రాజ సింహారెడ్డి, జామా, రాజేశ్కన్న, అరవింద్, ప్రభాకర్, అశ్వన్, పరమేశ్, సబిత, శశికళ, కవిత, నీత, విష్ణు పాల్గొన్నారు. అదేవిధంగా ఆనంద్బాగ్లోని ప్రసన్నాంజనేయ స్వామి ఆలయ ప్రథమ వార్షికోత్సవ పూజల్లో ఎమ్మెల్యే హన్మంతరావు పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. కార్యక్రమంలో కార్పొరేటర్ ప్రేంకుమార్, మాజీ కార్పొరేటర్ జగదీశ్గౌడ్ పాల్గొన్నారు.