కవాడిగూడ, జూన్ 23: ఆపదలో ఉన్న వారికి రక్తదానం చేసి ప్రాణాలను కాపాడాలని సెంట్రల్ జోన్ డీసీపీ రాజేశ్ చంద్ర అన్నారు. హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనరేట్ ఆదేశాల మేరకు గాంధీనగర్ పోలీస్స్టేషన్ ఇన్స్పెక్టర్ ఎన్.మోహన్రావు నేతృత్వంలో గురువారం భోలక్పూర్ డివిజన్లోని ఘంటసాల మైదానంలో రెడ్క్రాస్ సొసైటీ సౌజన్యంతో రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా డీసీపీ రాజేశ్ చంద్ర మాట్లాడుతూ.. స్వచ్ఛందంగా శిబిరానికి వచ్చి రక్తదానం చేయడం అభినందనీయమని అన్నారు.
అనంతరం చిక్కడపల్లి ఏసీపీ యాదగిరి మాట్లాడుతూ.. తలసీమియా వ్యాధిలో బాధపడుతున్న వ్యాధి గ్రస్తులు, పిల్లలు రక్తం తక్కువగా ఉండటం వల్ల చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, అలాంటి వారి ప్రాణాలను కాపాడేందుకు ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా ముందుకొచ్చి రక్తదానం చేయాలన్నారు. చిక్కడపల్లి, గాంధీనగర్, ముషీరాబాద్ పోలీస్స్టేషన్ల ఎస్ఐలు, కానిస్టేబుళ్లు, పోలీస్ కానిస్టేబుల్ అభ్యర్థులు, యువత రక్తదానం చేశారు. ఈ సందర్భంగా రక్తసేకరణకు ముందుకు వచ్చిన రెడ్క్రాస్ సొసైటీకి ఏసీపీ అభినందనలు తెలిపారు. కార్యక్రమంలో గాంధీనగర్, ముషీరాబాద్, చిక్కడపల్లి పోలీస్స్టేషన్ ఇన్స్పెక్టర్లు ఎన్.మోహన్ రావు, జహంగీర్ యాదవ్, సంజీవ్కుమార్, డీఐలు వెంకన్న, ప్రమోద్కుమార్, నరేశ్, ఎస్ఐలు నాగరాజు రెడ్డి, కావ్య, శ్రీనివాస్, జీవన్రెడ్డి, నాగరాజు, శ్రీశైలం, సోమేశ్ కుమార్, సురేందర్, కిరణ్, నాగరాజు తదితరులు పాల్గొన్నారు.