ఉస్మానియా యూనివర్సిటీ, జూన్ 23: ప్రపంచ వ్యాప్తంగా సాహిత్యంలో నూతన ధోరణులు ప్రవేశించాయని ఇండియన్ సొసైటీ ఫర్ కామన్వెల్త్ స్టడీస్ అధ్యక్షుడు ప్రొఫెసర్ ఆర్కే ధావన్ అన్నారు. ప్రజల జీవితాలకు సంబంధించిన వాస్తవిక అంశాలపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉన్నదని చెప్పారు. బేగంపేట ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల ఇంగ్లిష్ విభాగం, ఉస్మానియా యూనివర్సిటీ సెం టర్ ఫర్ ఇంటర్నేషనల్ స్టడీస్ (ఓయూసీఐఎస్) సంయుక్తంగా ‘లాంగ్వేజ్ అండ్ లిటరేచర్: కల్చరల్ అండ్ పెడగాజికల్ పర్స్పెక్టివ్స్ ఇన్ ది కాంటెక్ట్స్ ఆఫ్ ఎన్ఈపీ 2020’ అనే అంశంపై రెండు రోజుల అంతర్జాతీయ సదస్సును ఆఫ్లైన్, ఆన్లైన్ విధానంలో నిర్వహిస్తున్నారు.
ఓయూసీఐఎస్ సెమినార్ హాల్లో నిర్వహించిన సదస్సు ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా ప్రొఫెసర్ ఆర్కే ధావన్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడు తూ.. ఇంగ్లిష్ భాష, సాహిత్యాన్ని అధ్యయనం చేయ డం ద్వారా ప్రపంచాన్ని అర్థం చేసుకోవడం సులభమవుతుందని అన్నారు. కరోనా అనంతరం విద్య, పరిశోధనా రంగంలో అతి ముఖ్యమైన మార్పులు సంభవించాయని చెప్పారు. భాష, సాహిత్యాల మధ్య విభజన లేదని, అనేక భాషలకు పుట్టినిల్లయిన భారతదేశంలో ఈ రెండూ కలిసి ఉన్నాయని పే ర్కొన్నారు. ప్రస్తుతం భాషా సాహిత్యాలు వెనుకబడిన సందర్భంగా ఈ సద స్సు నిర్వహించడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో కాకతీయ యూనివర్సిటీ మాజీ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ కె. పురుషోత్తం, ఓయూ ఫ్యాకల్టీ ఆఫ్ ఆర్ట్స్ డీన్ ప్రొఫెసర్ మురళీకృష్ణ, ఇంగ్లిష్ విభాగం మాజీ హెడ్ ప్రొఫెసర్ ఎ. కరుణాకర్, ఓయూసీఐఎస్ డైరెక్టర్ డాక్టర్ కొండ నాగేశ్వరరావు, కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ పద్మావతి, సదస్సు కన్వీనర్ డాక్టర్ ఎం. నిర్మల, కొల్కతా యూనివర్సిటీ ప్రొఫెసర్ ప్రదీప్తా ముఖర్జీ, ఢిల్లీ యూనివర్సిటీ ప్రొఫెసర్ సుమన్ బాల, ఐఐటీ కాన్పూ ర్ ప్రొఫెసర్ టి.రవిచంద్రన్, కళాశాల ఇంగ్లిష్ విభాగం హెడ్ వసంతకుమారి, డాక్టర్ నాన్సీ సెరీనా పాల్గొన్నారు.
ఓయూ మోడల్ స్కూల్లో రోబోటిక్స్పై వర్క్షాప్
ఉస్మానియా యూనివర్సిటీ, జూన్ 23: ఉస్మానియా యూనివర్సిటీ మోడల్ స్కూల్లో విద్యార్థులకు రోబోటిక్స్ను పరిచయం చేసేందుకు ఒకరోజు వర్క్షాప్ను గురువారం నిర్వహించారు. ఇదే పాఠశాల పూర్వవిద్యార్థులు సహదేవ్ ప్రారంభించిన సోహమ్ అకాడమీ ఆఫ్ హ్యూమన్ ఎక్స్లెన్స్ సంస్థ తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా విద్యార్థులకు రోబోటిక్స్ పరిజ్ఞానాన్ని పరిచయం చేసేందుకు 150 పాఠశాలలను ఎంపిక చేసుకున్నారు. వాటిలో మొదటిసారిగా ఓయూ మోడల్ స్కూల్లో నిర్వహించారు. విద్యార్థుల సృజనాత్మకతను పెంచేందుకు సెన్సార్లు, మోటర్, డిస్ప్లేలు వంటి వివిధ ఎలక్ట్రానిక్ వస్తువులను ఎలా ఉపయోగించాలో శిక్షణ ఇచ్చి అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా పాఠశాల స్పెషల్ ఆఫీసర్ డాక్టర్ పారుపల్లి శంకర్ మాట్లాడుతూ.. పాఠశాలలో చేరిన విద్యార్థులకు నూతన విద్యావిధానం -2020 కార్యక్రమాలు, 21వ శతాబ్దపు నైపుణ్యాలు పెంపొందించుకునేందుకు ఈ శిక్షణ కార్యక్రమాలు ఉపయోగపడతాయన్నారు. పాఠశాలలో కంప్యూటర్ విద్య, ఫిజికల్ ఎడ్యుకేషన్తో పాటు మంచి అకాడమిక్ ఇన్పుట్తో ఉచిత విద్యను అందిస్తున్నట్లు వివరించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధాన అధ్యాపకులు జ్యోతిశ్రీ, ఇతర ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.