రానున్న కాలమంతా ఎలక్ట్రిక్ వాహనాలదే. కాలుష్య నివారణ, పర్యావరణ పరిరక్షణకు వీటి ప్రాధాన్యత పెరుగుతున్నది. పైగా మండుతున్న ఇంధన ధరలకు ప్రత్యామ్నాయంగా చాలా మంది విద్యుత్ వెహికిల్స్పై ఆసక్తి చూపుతున్నారు. బ్యాటరీతో నడిచే వీటికి చార్జింగ్ పాయింట్లు చాలా కీలకం. ఈ నేపథ్యంలో పర్యావరణహితమైన ‘ఈవీ’లను మరింత ప్రోత్సహించేందుకు బల్దియా కీలక నిర్ణయం తీసుకున్నది. గ్రేటర్లో 14 చోట్ల చార్జింగ్ స్టేషన్ల (4 వీలర్ల కోసం) ఏర్పాటుకు సంకల్పించింది. సుమారు 100 ప్రాంతాల్లో నెలకొల్పాలని లక్ష్యంగా పెట్టుకోగా, తొలివిడతలో టీఎస్ రెడ్కో సాంకేతిక సహకారంతో పద్నాలుగు చోట్ల సన్నాహాలు చేస్తున్నది. కిలోవాట్కు రూపాయి చొప్పున చార్జీ వసూలు చేయాలని నిర్ణయించింది. వచ్చిన ఆదాయాన్ని మూడు నెలలకొకసారి టీఎస్ రెడ్కో జీహెచ్ఎంసీకి చెల్లించేలా ఒప్పందం కుదిరింది. 22న మేయర్ గద్వాల్ విజయలక్ష్మి అధ్యక్షతన జరిగే స్టాండింగ్ కమిటీలో ఈ ప్రతిపాదనను ఆమోదించి ప్రభుత్వానికి పంపనున్నారు.
సిటీబ్యూరో, జూన్ 20 (నమస్తే తెలంగాణ): పర్యావరణ పరిరక్షణ, సహజ వనరుల సంరక్షణ లక్ష్యంగా అందుబాటులోకి తీసుకురానున్న ఎలక్ట్రిక్ వాహనాలను ప్రోత్సహించేలా జీహెచ్ఎంసీ 14 చోట్ల ఎలక్ట్రిక్ చార్జింగ్ స్టేషన్ల (4వీలర్)ను ఏర్పాటు చేయబోతున్నది. ఇప్పటికే హైదరాబాద్ మెట్రో రైలు ప్రాజెక్టులో భాగంగా ఎలక్ట్రిక్ వాహనాల చార్జింగ్ స్టేషన్లను 20 మెట్రోస్టేషన్లలో ఏర్పాటు చేయగా, తాజాగా జీహెచ్ఎంసీ గ్రేటర్లో దాదాపు 100 చోట్ల ఏర్పాటు చేయాలని నిర్ణయించి తొలి విడతగా 14 చోట్ల చార్జింగ్ స్టేషన్ల ఏర్పాటుకు శ్రీకారం చుట్టింది. టీఎస్ రెడ్కో సాంకేతిక సహకారంతో ముందుకు వెళ్లాలని ప్రతిపాదించింది. కిలోవాట్కు రూపాయి చొప్పున చార్జీలు వసూలు చేయాలని నిర్ణయించారు. వచ్చిన ఆదాయాన్ని మూడు నెలలకోసారి టీఎస్ రెడ్కో జీహెచ్ఎంసీకి చెల్లించేలా ఒప్పందం కుదుర్చుకున్నారు. ఈ ప్రతిపాదనను ఈ నెల 22వ తేదీన మేయర్ గద్వాల్ విజయలక్ష్మి అధ్యక్షతన జరిగే స్టాండింగ్ కమిటీలో ఆమోదించి ప్రభుత్వానికి పంపనున్నారు.
ప్రజల్లో ఇప్పుడిప్పుడే ఎలక్ట్రిక్ వాహనాలపై అవగాహన పెరుగుతోంది. కంపెనీలు కూడా ఎలక్ట్రిక్ వాహనాల్లో కొత్త మోడల్స్ తీసుకొస్తుండడం, కేంద్ర ప్రభుత్వం కూడా సబ్సిడీ ఇస్తుండడంతో ఎలక్ట్రిక్ వాహనాలు కొనేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఎలక్ట్రిక్ వాహనాలకు చార్జింగ్ స్టేషన్లు కీలకం. ఒకసారి చార్జింగ్ చేస్తే బ్యాటరీ సామర్థ్యాన్ని బట్టి నిర్ణీత కిలోమీటర్లు మాత్రమే వాహనం ప్రయాణిస్తుంది. చార్జింగ్ అయిపోతే తిరిగి ఇంధనం వినియోగించాలి. దీనిని దృష్టిలో ఉంచుకొని నగరంలో విరివిగా చార్జింగ్ పాయింట్లు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. వాహనాలు పారింగ్ చేసే చోటే ఈ స్టేషన్లు ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. పారింగ్ ఏరియాలు, వాహనాలు నిలిపేందుకు అనువుగా ఉన్న ఖాళీ స్థలాల్లో చార్జింగ్ స్టేషన్లు ఏర్పాటు చేయనున్నారు.
ప్రభుత్వ ప్రోత్సాహం…
ఎలక్ట్రిక్ వాహనాల వాడకాన్ని ప్రోత్సహించేందుకు ఇప్పటికే రిజిస్ట్రేషన్, రోడ్ ట్యాక్స్ల నుంచి తెలంగాణ ప్రభుత్వం మినహాయింపులు ఇచ్చింది. నగరంలో ఉన్న ఐటీ కంపెనీల్లో చార్జింగ్ స్టేషన్ల ఏర్పాటుకు కసరత్తు ప్రారంభింది. అదేవిధంగా మెట్రో స్టేషన్లలో కొన్నింటిలో ఇప్పటికే ఈవీ చార్జింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. తాజాగా ఈవీ చార్జింగ్ అవసరమైన విద్యుత్ సరఫరాను అందించే విద్యుత్ పంపిణీ సంస్థను భాగస్వామ్యం చేయడం ద్వారా మరింతగా ఈవీ చార్జింగ్ సౌకర్యం నగరంలో అందుబాటులోకి రానుంది. ఆయా కార్యాలయాల్లో స్థలాన్ని బట్టి ప్రతి కార్యాలయంలో 4 కంటే ఎక్కువ చార్జింగ్ పాయింట్లను ఏర్పాటు చేయనున్నారు.
మెట్రోరైలు కారిడార్లో ఏర్పాటు చేసిన ఈవీ చార్జింగ్ స్టేషన్లు
కంపెనీ ఈవీ చార్జింగ్ పాయింట్లను ఏర్పాటు చేసిన మెట్రో స్టేషన్లు
పోర్టం (4 వీలర్స్) కూకట్పల్లి,ఎన్జీఆర్ఐ, ఉప్పల్ స్టేడియం, మెట్టుగూడ, తార్నాక, బేగంపేట, కేపీహెచ్బీ, మూసాపేట
పవర్గ్రిడ్ కంపెనీ (4 వీలర్స్) మియాపూర్, బాలానగర్
సాబూ కైనెటిక్ (2,3వీలర్స్) దిల్సుఖ్నగర్, ఉప్పల్, సికింద్రాబాద్ ఈస్ట్, కూకట్పల్లి
ఈటీవో (2,3వీలర్స్) నాగోల్, ఎన్జీఆర్ఐ, హబ్సిగూడ, తార్నాక, పరేడ్ గ్రౌండ్, రసూల్పుర, జేఎన్టీయూ కాలేజ్, మియాపూర్, పంజాగుట్ట, ఎంజీబీఎస్, అమీర్పేట