సికింద్రాబాద్, జూన్ 19;ఈనెల 13 నుంచి పాఠశాలలు పునఃప్రారంభమయ్యాయి. ప్రైవేటు పాఠశాలల విద్యార్థులు ఆయా పాఠశాలల బస్సుల్లో స్కూళ్లకు వెళుతున్నారు. తమ పిల్లలను తీసుకెళ్తుతున్న ఆ బస్సులు కండిషన్పై తల్లిదండ్రుల్లో ఒకింత ఆందోళన ఉంది. బస్సుల్లో 25 నుంచి 40 వరకు సీటింగ్ సామర్ధ్యం ఉండగా 40 నుంచి 60 మంది విద్యార్థులను ఎక్కించుకుంటున్నారు. ఏదైనా అనుకోని ప్రమాదం జరిగితే పెద్ద మొత్తంలో ప్రాణనష్టం జరిగే అవకాశం ఉంది. చాలామంది విద్యార్థుల తల్లిదండ్రులు తమ పిల్లలను స్కూళ్లకు ఆటోలలోనూ పంపిస్తున్నారు. వాటిల్లో కూడా డ్రైవర్లు పరిమితికి మించి 10 నుంచి 15 మంది విద్యార్థులను తీసుకెళ్తుంటారు.
కాలం చెల్లిన బస్సులే ఎక్కువ
కొన్ని విద్యాసంస్థలు కాలం చెల్లిన బస్సులకు పైపై మెరుగులు దిద్ది నడుపుతున్నాయి. 15 ఏళ్లు దాటినవే. అయినా వాటికి ఎక్స్టెన్షన్ తీసుకోని నడుపుతున్నాయి. చాలా పాఠశాలలు విద్యార్థుల రవాణాకు వాడుతున్న బస్సులను సెకండ్హాండ్లో తక్కువ ధరకు కొన్నవే. వీటిలో ఎక్కువ ఢిల్లీ నుంచి తీసుకువచ్చినవే. ఢిల్లీలో 15 ఏండ్ల్లు దాటిన బస్సులను రోడ్లమీద నడపడానికి అక్కడి ఆర్టీఏ అధికారులు అనుమతించరు. దీనితో వేలం వేసిన ఈ బస్సులను ఇక్కడి ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలు కొనుగోలు చేసి తీసుకొస్తున్నట్టు సమాచారం.
ఫిట్నెస్ తనిఖీలు
పాఠశాలలు పునఃప్రారంభం కావడంతో రవాణాశాఖ అధికారులు ప్రైవేటు పాఠశాలల బస్సులపై దృష్టి సారించారు. ఈనెల 13 నుంచే వాటిని తనిఖీ చేయడం మొదలుపెట్టారు. బస్సులను ఆర్టీఏ కార్యాలయానికి రప్పించి నిశితంగా తనఖీలు చేస్తున్నారు. వాటి ఫిట్నెస్ను పరిశీలిస్తున్నారు. వాటి యజమానులకు నోటీసులు పంపించారు. రంగంలోకి దిగిన ఆర్టీఏ అధికారులు స్కూలు బస్సులపై కొరడా ఝుళిపిస్తున్నారు.
మోటారు వాహన చట్టం ప్రకారం