చిక్కడపల్లి, జూన్ 12 : సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకుంటూ ప్రజా సమస్యల పరిష్కారానికి ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ శ్రీకారం చుట్టారు. రాష్ట్రంలోనే మొట్ట మొదటిసారిగా ‘ఎమ్మెల్యే కేర్స్’ పేరుతో క్యూఆర్ కోడ్ ద్వారా ఫిర్యాదులు స్వీకరించనున్నారు. ఆదివారం గాంధీనగర్ డివిజన్లోని హెచ్ఆర్ వసుధ అపార్ట్మెంట్లో ‘ఎమ్మెల్యే కేర్స్’ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే ముఠా గోపాల్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అపార్ట్మెంట్వాసులు వారి ఫిర్యాదులు సులభంగా తమ దృష్టికి తీసుకురావడానికి క్యూఆర్ కోడ్ను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. నియోజకవర్గంలోని అన్ని అపార్ట్మెంట్లలో క్యూఆర్ కోడ్కు సంబంధించిన స్టికర్ను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ యువజన విభాగం నాయకుడు ముఠా జయసింహ, మాజీ కార్పొరేటర్ ముఠా పద్మ, డివిజన్ అధ్యక్షుడు రాకేశ్, కుమార్, ముచ్చకుర్తి ప్రభాకర్, మారిశెట్టి నర్సింగ్ రావు, శ్రీకాంత్, పున్న సత్యనారాయణ, ఎస్టీ ప్రేమ్ స్థానిక అపార్ట్మెంట్ వాసులు పాల్గొన్నారు.