జియాగూడ, మే 28 : కుల్సుంపురా పోలీస్స్టేషన్ పరిధిలో దారుణం జరిగింది. ఓ మహిళను బంధువులు రోకలిబండతో కొట్టి హత్య చేశారు. ఇన్స్పెక్టర్ టి.అశోక్కుమార్ తెలిపిన వివరాల ప్రకారం….సరూర్నగర్కు చెందిన కె. రాజు చెల్లెలు అమ్ములు అలియాస్ స్వాతి జియాగూడలో నివాసముంటున్నది. శుక్రవారం ఉదయం అమ్ములు తన అన్నకు ఫోన్ చేసి..కల్లు తెమ్మని చెప్పింది. జియాగూడకు వచ్చిన కె.రాజు.. కల్లు తాగి.. నిద్రపోయాడు. ఈ క్రమంలో అతడి జేబు నుంచి ఎవరో 2వేలు తీసుకున్నారు. నిద్ర లేచిన కె.రాజు జేబులో డబ్బులు కనిపించకపోవడంతో అక్కడ ఉన్న వారిని అడగ్గా, ఎవరూ సమాధానం ఇవ్వలేదు. దీంతో తన చెల్లెలు ఫోన్ తీసుకుని సరూర్నగర్ వెళ్లిపోయాడు. దీంతో అమ్ములు భర్త రాజు మరికొందరు కలిసి అక్కడికి వెళ్లి.. కె. రాజు కోసం వెతికారు. అతడు లేకపోవడంతో అతడి వదిన రాములమ్మ (50)ను జియాగూడకు తీసుకొచ్చారు. విషయం తెలియడంతో కె. రాజు అక్కడికి చేరుకున్నాడు. 2వేలు ఇస్తేనే ఫోన్ ఇస్తానని అతడు చెప్పగా, ఈ క్రమంలో రాములమ్మను బంధువులు కొట్టారు. కె. రాజు వచ్చిన అనంతరం అమ్ములు భర్త రాజు మిగతా బంధువులు గొడవపడ్డారు. అడ్డువచ్చిన రామ్ములమ్మ తలపై రోకలిబండ కొట్టడంతో ఆమె స్పృహ తప్పిపడిపోయింది. దవాఖానకు తరలించగా, అప్పటికే మృతి చెందినట్లు వెద్యులు ధ్రువీకరించారు. పోలీసులు అమ్ములు అలియాస్ స్వాతి, రాజు, ప్రేమ్, నందు, విజయలక్ష్మి, జంగయ్య, సరితలపై కేసు నమోదు చేశారు.