సిటీబ్యూరో, మే 28 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు ఘనంగా నిర్వహించేలా ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్కుమార్ అధికారులను ఆదేశించారు. పబ్లిక్గార్డెన్స్లో జూన్ 2న జరిగే రాష్ట్ర ఆవిర్భావ వేడుకల ఏర్పాట్లను శనివారం డీజీపీ మహేందర్రెడ్డి, నగర పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్తో కలిసి సోమేశ్కుమార్ పరిశీలించారు. ఈ సందర్భంగా అధికారులకు పలు సూచనలు చేశారు. పోలీసుల మాక్డ్రిల్తోపాటు ఇతర శాఖల ఏర్పాట్లను పరిశీలించారు. జూన్ 2న సీఎం కేసీఆర్ గన్పార్క్ అమరవీరుల స్తూపం వద్ద నివాళులర్పించి అనంతరం పబ్లిక్గార్డెన్కు చేరుకుంటారు. జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన తర్వాత వేడుకల్లో ప్రసంగిస్తారని అధికారులు వివరించారు. ఈ కార్యక్రమంలో హౌసింగ్ ప్రత్యేక ముఖ్యకార్యదర్శి సునీల్శర్మ, ఆర్అండ్బీ కార్యదర్శి శ్రీనివాస్రాజు, ఆరోగ్యశాఖ కార్యదర్శిరిజ్వి, జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేశ్కుమార్, సీనియర్ అధికారులు, పోలీసు ఉన్నతాధికారులు ఉన్నారు.