సిటీబ్యూరో, మే 28 (నమస్తే తెలంగాణ): ఎల్ఈడీ దీపాలతో 75 శాతం విద్యుత్ ఆదా అవుతుందని రాష్ట్ర ప్రైవేట్ ఎలక్ట్రికల్ అసోసియేషన్ అధ్యక్షుడు నక్కా యాదగిరి అన్నారు. అసోసియేషన్ ఆధ్వర్యంలో శనివారం నగరంలో ఎలక్ట్రీషియన్స్తో నిర్వహించిన రెండు రోజుల అవగాహన సదస్సులో ఆయన మాట్లాడారు. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా ఎలీఈడీ విద్యుత్ దీపాల వినియోగం అధికమైందని, విద్యుత్ పరికరాలను ఎన్నుకోవడంలో వాటి ధరను చూసి కాకుండా భద్రతపై దృష్టి పెట్టాలన్నారు. కార్యక్రమంలో శ్రీరాం ఎంటర్ప్రైజెస్ నిర్వాహకులు గణేశ్ చందాక్, అసోసియేషన్ ప్రతినిధులు ఆర్. శ్రీనివాస్, నేమాల బెనర్జీ తదితరులు పాల్గొన్నారు.