దుండిగల్,మే23: నిజాంపేట్ కార్పొరేషన్ను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తున్నామని మేయ ర్ కొలన్ నీలాగోపాల్రెడ్డి అన్నారు. సోమవారం మేయర్ నీలాగోపాల్రెడ్డి అధ్యక్షతన కార్పొరేషన్ కార్యాలయ సమావేశ మందిరంలో పాలకమండలి సాధారణ సర్వసభ్య సమావేశం జరిగింది.ఈ సందర్భంగా కార్పొరేషన్ వ్యాప్తంగా ఉన్న 33డివిజన్లలో చేపట్టబోయే అభివృద్ధి పనులకు గాను రూ.48.51 కోట్లుతో చేపట్టబోయే అభివృధ్ధి పనులకు సంబంధించిన తీర్మానాలను ప్రవేశపెట్టి, ఆమోదింపజేశారు. ఇందులో ప్రధానంగా హరితహారం కార్యక్రమానికి రూ.1.20కోట్లు, పారిశుధ్య నిర్వహణకు రూ.3.7కోట్లను కేటాయిస్తూ తీర్మానించగా పాలక మండ లి సభ్యులు ఆమోదముద్ర వేశారు. అనంతరం పెండింగ్లో ఉన్న పనుల పరిస్థితి, భవిష్యత్లో చేపట్టాల్సిన పనులపై మేయర్ సమీక్ష నిర్వహించారు.
స్వచ్ఛ నిజాంపేట్ దిశగా చేపట్టబోయే చర్యలు, సఫాయి మిత్ర సురక్ష, వైకుంఠధామాలు, పార్కుల అభివృద్ధి, పట్టణ ప్రగతిలో చేపట్టాల్సిన పనులు, ఆయా డివిజన్ల పరిధిలో నెలకొన్న సమస్యలు, వాటి పరిష్కారానికి తీసుకోనున్న చర్యలపై సుధీర్ఘంగా చర్చించారు.సమావేశంలో కమిషనర్ వంశీకృష్ణ, ఇంజినీరింగ్, శానిటేషన్, వాటర్ వర్క్స్, టౌన్ ప్లానింగ్, ఎలక్ట్రికల్, రెవెన్యూ, పోలీస్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.
కమిషనర్,హరితహారం అసిస్టెంట్ డైరెక్టర్కు సన్మానం
నిజాంపేట్ కార్పొరేషన్ మేయర్ నీలాగోపాల్రెడ్డి ఆధ్వర్యంలో సోమవారం నూతన కమిషనర్గా ఇటీవల బాధ్యతలు స్వీకరించిన వంశీకృష్ణ, హరితహారం విభాగం అసిస్టెంట్ డైరెక్టర్గా బాధ్యతలు చేపట్టిన నాగిరెడ్డిని కార్పొరేటర్లు, కోఆప్షన్ సభ్యులు శాలువాతో సత్కరించారు. పరిపాలనా విషయంలో తమ సహాయసహకారాలు ఎల్లప్పుడు ఉంటాయని మేయర్ పేర్కొన్నారు.