సిటీబ్యూరో, మే 23(నమస్తే తెలంగాణ)/ సికింద్రాబాద్, మే 23: మద్యం సేవించి న్యూసెన్స్ చేసిన ఓ వ్యక్తికి 112 రోజులు జైలు శిక్ష పడింది. ఈ సంఘటన కార్ఖానా పోలీస్ స్టేసన్ పరిధిలో జరిగింది. సీఐ రవీందర్ కథనం ప్రకారం.. కార్ఖానాకు చెందిన మహ్మద్ సలీం (35) తరచూ మద్యం సేవించి బస్తీలో న్యూసెన్స్ చేసేవాడు. ఇలా అనేక మార్లు చేస్తుండటంతో స్థానికులు అతడిపై కార్ఖానా పోలీసులకు ఫిర్యాదు చేశారు. అదుపులోకి తీసుకున్న పోలీసులు 13 స్పెషల్ ఎంఎం సెకండ్ బాండ్ ద్వారా జ్యుడీషియల్ కస్టడీకి తరలించగా కోర్టు 112రోజులు జైలు శిక్ష విధించింది.