సుల్తాన్బజార్,మే 23: చిన్నారులకు ట్రాఫిక్ నిబంధనలు, రోడ్డు ప్రమాదాల నివారణ చర్యలపై అవగాహన కల్పించేందుకు వేసవి శిబిరాలు ఎంతోగానో దోహదం చేస్తాయని నగర ట్రాఫిక్ జాయింట్ సీపీ ఏవీ రంగనాథ్ అన్నారు. ఈ మేరకు హోండా సంస్థ ఆధ్వర్యంలో గోషామహల్ ట్రాఫిక్ ట్రైనింగ్ ఇనిస్టిట్యూట్లో ఏర్పాటు చేసిన రోడ్ సేఫ్టీ, సమ్మర్ క్యాంప్ను ఆయన, టీటీఐ ఇన్స్పెక్టర్ హరీశ్తో కలిసి ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ట్రాఫిక్ నిబంధనలు, వ్యక్తిత్వ వికాసం, మార్షల్ ఆర్ట్స్, రోడ్డు ప్రమాదాల నివారణ చర్యలపై చిన్నారులకు ఆరు రోజుల పాటు ఈ శిబిరంలో శిక్షణ ఇస్తామని తెలిపారు. ఈ సమ్మర్ క్యాంపును నిర్వహించడం సంతోషంగా ఉన్నదన్నారు.