షేక్పేట్ మే 23: ప్రజలకు అందుబాటులో ఉంటూ సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తున్నామని, టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ తెలిపారు. సోమవారం షేక్పేట్ డివిజన్ గుల్షన్ కాలనీ, సమతా కాలనీల్లో సమస్యలపై శంఖారావం కార్యక్రమంలో భాగంగా వివిధ ప్రభుత్వ శాఖల అధికారులతో కలిసి పాదయాత్ర నిర్వహించారు. ప్రజలతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. మౌలిక సదుపాయాలను కల్పించడానికి నియోజకవర్గంలో కోట్లాది రూపాయాలతో పనులను చేపడుతున్నామన్నారు. డీఎంసీ రజనీకాంత్, జలమండలి డీజీఎం జవహర్ అలీ, జీహెచ్ఎంసీ, విద్యుత్, పోలీస్ శాఖ అధికారులు , డివిజన్ అధ్యక్షుడు దుర్గం ప్రదీప్ కుమార్, కార్యదర్శి షకీల్, సజ్జాద్,మధుసూదన్ పాల్గొన్నారు.
కోట్లాది రూపాయలతో అభివృద్ధి పనులు..
వెంగళరావునగర్, మే 23: కోట్లాది రూపాయలతో అభివృద్ధి పనులు చేపట్టామని ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ తెలిపారు. వెంగళరావునగర్ డివిజన్ యూసుఫ్గూడలో రూ.5 కోట్ల 95 లక్షలతో నిర్మించ తలపెట్టిన మున్సిపల్ సర్కిల్ కార్యాలయానికి సోమవారం భూమి పూజ చేసి పనులను ప్రారంభించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ సర్కిల్ కార్యాలయం నిర్మాణాన్ని త్వరలో పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తెచ్చేందుకు కృషి చేస్తామన్నారు. పరిపాలన సౌలభ్యం, ప్రజల చెంతకే పాలనను తీసుకొచ్చేందుకే జీహెచ్ఎంసీ సర్కిల్ కార్యాలయాన్ని నిర్మిస్తున్నామని తెలిపారు. కార్పొరేటర్ దేదీప్య విజయ్, జీహెచ్ఎంసీ ఈఈ రాజ్ కుమార్, డీఈ రామంద్రరాజు, ఏఈ ఫరీద్, డివిజన్ అధ్యక్షుడు అజయ్, ప్రధాన కార్యదర్శి వేణు పాల్గొన్నారు.
నేటి నుంచి బోరబండలో శంఖారావం
బోరబండ డివిజన్లో నేటి నుంచి సమస్యలపై శంఖారావం.. మలివిడత పాదయాత్ర కార్యక్రమం చేపట్టనున్నట్లు టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ తెలిపారు. సోమవారం ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో నిర్వహించిన ముఖ్యకార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు ప్రతి ఇంటికి అందజేయడంలో బోరబండ డివిజన్ కార్యకర్తలు విశేషంగా కృషి చేశారన్నారు. డివిజన్ అధ్యక్షుడు కృష్ణమోహన్, విజయ్కుమార్, డివిజన్ కో ఆర్డినేటర్ విజయ సింహ, టెంపుల్ చైర్మన్ లక్ష్మణ్ గౌడ్, సత్తార్, గోకికర్ సాయి, యాదన్న, ఫయాజ్ ఖాన్, వీరేశం, శివకుమార్, సరళ, ధనలక్ష్మి, డేవిడ్, కవిత, సూర్యకళ, మహేందర్ గౌడ్, రమేశ్ తదితరులు పాల్గొన్నారు.