మేడ్చల్ రూరల్, మే 23 : ప్రతి గ్రామంలో క్రీడా ప్రాంగణం ఏర్పాటు చేయాలని సీఎం కేసీఆర్ నిర్ణయించడం అభినందనీయమని ఎంపీపీ రజితా రెడ్డి, జడ్పీటీసీ శైలజారెడ్డి అన్నారు. మండల పరిధిలోని ఐదు గ్రామాల్లో సోమవారం పర్యటించి, క్రీడా ప్రాంగణాల ఏర్పాటుకు స్థలాన్ని పరిశీలించారు. డబిల్పూర్లో 704, 705 సర్వే నంబర్లలో ఉన్న ఎకరా భూమి, గౌడవెల్లిలో 250 సర్వే నంబర్లోని 20 గుంటల భూమి, మునీరాబాద్లో 26 సర్వే నంబర్లోని 2.12 ఎకరాల భూమి, పూడూరులో 379 సర్వే నంబర్లోని 2 ఎకరాల భూమి, ఎల్లంపేటలో 82 సర్వే నంబర్లోని 1.20 ఎకరాల భూమిని క్రీడా ప్రాంగణాల ఏర్పాటుకు పరిశీలించారు.
ఈ సందర్భంగా ఎంపీపీ, జడ్పీటీసీ మాట్లాడుతూ క్రీడా ప్రాంగణాల ఏర్పాటుతో విద్యార్థులు, యువత క్రీడలపై దృష్టి సారిస్తారన్నారు. తద్వారా గ్రామీణ ప్రాంతాల నుంచి క్రీడా ఆణిముత్యాలు వెలుగు చూసే అవకాశం ఉందన్నారు. కార్యక్రమంలో ఎంపీడీవో రమాదేవి, తాసీల్దార్ గీత, సర్పంచ్లు గీతాభాగ్యారెడ్డి, సురేందర్ ముదిరాజ్, గణేశ్, గోప గణేశ్, ఎంపీటీసీ సభ్యులు రఘు, కుమార్ యాదవ్, రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సభ్యురాలు రాగజ్యోతి, పంచాయతీ కార్యదర్శి శోభారాణి పాల్గొన్నారు.
కీసర మండల పరిధిలో…
కీసర, మే 23 : గ్రామాల్లో క్రీడా ప్రాంగణాల ఏర్పాటుకు మండలంలోని పలు గ్రామాల్లో ప్రభుత్వ భూములను పరిశీలిస్తున్నామని ఎంపీడీవో పద్మావతి తెలిపారు. మండల కేంద్రంలోని పెద్దమ్మ చెరువు సమీపంలో ఉన్న స్థలాన్ని ఎంపీడీవో పద్మావతి, పంచాయతీరాజ్ ఏఈ శ్రీనివాస్, ఎంపీవో మంగతాయారు, మండల సర్వేయర్ శ్రీనివాస్తో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఎంపీడీవో మాట్లాడుతూ ప్రతి గ్రామంలో అరెకరా నుంచి ఎకరా వరకు ప్రభుత్వ స్థలాన్ని కేటాయించి, ఆ స్థలంలో గ్రామీణ క్రీడా ప్రాంగణాన్ని ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నుంచి ఆదేశాలు వచ్చాయన్నారు.
మండలంలోని కరీంగూడ, రాంపల్లిదాయర, గోధుమకుంట, నర్సంపల్లి గ్రామాల్లో ప్రభుత్వ భూమి లేదని, ఆ ఏరియాల్లో వెంచర్లలో ఉన్న పార్కు స్థలాలను ఎంపిక చేస్తామన్నారు. క్రీడా ప్రాంగణం ఎంపికైన తరువాత దాని చుట్టూ గ్రీన్ ఫెన్సింగ్ ఏర్పాటు చేస్తామని తెలిపారు. జూన్ 2న మంత్రి మల్లారెడ్డి క్రీడా ప్రాంగణాలను ప్రారంభిస్తారని చెప్పారు. కార్యక్రమంలో అధికారులు పాల్గొన్నారు.