పీర్జాదిగూడ, మే 23 : ఎనిమిదో విడత హరితహారంలో భాగంగా పీర్జాదిగూడ కార్పొరేషన్ను హరితమయంగా తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని మేయర్ జక్క వెంకట్రెడ్డి పిలుపునిచ్చారు. సోమవారం మున్సిపల్ కార్యాలయంలో స్వచ్ఛ సర్వేక్షణ్, హరితహారం కార్యక్రమాల పై మేయర్ వివిధ విభాగాల అధికారులు, వార్డు ఆఫీసర్లతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.
కార్పొరేషన్ పరిధిలో భువన సర్వే ద్వారా జియో ట్యాగింగ్ చేసి డిజిటల్ సర్వేను త్వరగా పూర్తి చేయాలన్నారు. జూన్ 3 నుంచి 15 రోజులు నిర్వహించే నాలుగో విడత పట్టణ ప్రగతి పనులను సమర్థవంతంగా నిర్వహించేందుకు సన్నద్ధం కావాలని పేర్కొన్నారు. హరితహారంలో నాటిన మొక్కలను సంరక్షించడానికి జియోట్యాగింగ్ పద్ధతిని అవలంబించాలని సూచించారు.కార్యక్రమంలో కమిషనర్ రామకృష్ణారావు, వివిధ విభాగాల అధికారులు, బిల్కలెక్టర్లు, వార్డు ఆఫీసర్లు పాల్గొన్నారు.
సీసీ రోడ్డు పనులు ప్రారంభం…
కార్పొరేషన్ పరిధి… 25వ డివిజన్ విహారిక కాలనీలో నూతనంగా చేపడుతున్న సీసీ రోడ్డు నిర్మాణ పనులను మేయర్, కార్పొరేటర్ హరిశంకర్రెడ్డితో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ డివిజన్ల పరిధిలో సమస్యలుంటే తమ దృష్టికి వచ్చిన వెంటనే పరిష్కరిస్తామన్నారు. కార్యక్రమంలో కార్పొరేటర్ హరిశంకర్రెడ్డి, నాయకులు సునీల్, చంద్రశేఖర్, అధికారులు, కాలనీ ప్రతినిధులు అశోక్రెడ్డి, రాజుకుమార్ నాయక్ పాల్గొన్నారు.