కీసర, మే 23 : పేద ప్రజలను అనారోగ్య సమయంలో సీఎం రిలీఫ్ ఫండ్ ఆదుకుంటున్నదని కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. మండల పరిధి…గోధుమకుంట గ్రామానికి చెందిన సామాల మల్లారెడ్డికి సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి మంజూరైన రూ.30 వేల చెక్కును మంత్రి మల్లారెడ్డి లబ్ధిదారుడికి సోమవారం అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ సీఎం సహాయనిధి కింద వచ్చే ఆర్థిక సహాయం అర్హులైన వారందరికి అందజేస్తున్నామని తెలిపారు. ప్రభుత్వం పేదల పక్షపాతి అని, సీఎం కేసీఆర్ పేదల సంక్షేమం, అభివృద్ధి కోసం అనేక పథకాలను అమలు చేస్తున్నారని చెప్పారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ మండల పార్టీ ఉపాధ్యక్షుడు వంగేటి పర్వత్రెడ్డితో పాటు పలువురు పాల్గొన్నారు.
పేదల సంక్షేమమే లక్ష్యం..
మేడ్చల్ కలెక్టరేట్, మే 23 : పేదల సంక్షేమం, అభివృద్ధే లక్ష్యమని నాగారం మున్సిపల్ చైర్మన్ కౌకుట్ల చంద్రారెడ్డి అన్నారు. మున్సిపాలిటీ పరిధిలోని 19వ వార్డు అరవింద్ నగర్ కాలనీకి చెందిన సురేందర్ రెడ్డికి రూ.60వేల సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కు మంజూరైంది. ఈ చెక్కులను లబ్ధిదారుడికి చైర్మన్ సోమవారం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం కేసీఆర్ పేద ప్రజల కోసం అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారని తెలిపారు. కార్యక్రమంలో వైస్ చైర్మన్ మల్లేశ్ యాదవ్, కౌన్సిలర్లు శ్రీనివాస్ గౌడ్, బి.శ్రీనివాస్ గౌడ్, టీఆర్ఎస్ నాయకులు శ్రీధర్, నిమ్మల శ్రీనివాస్, పాల్గొన్నారు.