బంజారాహిల్స్, మే 22: వెన్నెముక సమస్యతో పాటు చికిత్సలపై ప్రజల్లో అవగాహన పెంచేందుకు నిర్మాణ్ ఆర్గనైజేషన్ స్వచ్ఛంద సంస్థ, ఏషియన్ స్పైన్ హాస్పిటల్ సంయుక్త ఆధ్వర్యంలో బంజారాహిల్స్లోని కేబీఆర్ పార్కు వద్ద ‘వాక్ ఫర్ హెల్తీ స్పైన్’ పేరుతో వాకథాన్ నిర్వహించారు. ఈ వాకథాన్ను జలమండలి ఎండీ దాన కిశోర్ ప్రారంభించి మాట్లాడుతూ.. మారుతున్న జీవనశైలితో పాటు పలు కారణాలతో ఇటీవల వెన్ను నొప్పి సమస్యలతో బాధపడే వారి సంఖ్య గణనీయంగా పెరిగిందన్నారు. ఈ సమస్యపై అవగాహన కల్పించడం కోసం వాకథాన్ నిర్వహించడం అభినందనీయమన్నారు. కార్యక్రమంలో నిర్మాణ సంస్థ మిషన్ డైరెక్టర్ అబ్దుల్ వాహెద్, లక్ష్మీకాంత్, ఏషియన్ స్పైన్ హాస్పిటల్ సీఎండీ డా. సుకుమార్, సీఈవో డా.నరేశ్ కుమార్, నిర్మాణ్ సంస్థ సీఈవో మయూర్ పట్నాల, నానో హెల్త్ సీఈవో మనీశ్ రంజన్ తదితరులు పాల్గొన్నారు.