నేడు జరుగనున్న పది పరీక్షలకు విద్యా శాఖ అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. మండల పరిధిలో మొత్తం 17 పరీక్షా కేంద్రాల్లో 3 వేల 58 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. ప్రభుత్వ పాఠశాలకు చెందిన 530 మంది, ప్రైవేటు పాఠశాలకు చెందిన 1796 మంది, ఎయిడెడ్ పాఠశాలకు చెందిన 732 విద్యార్థులు పరీక్షలకు హాజరుకానున్నారు. 17 పరీక్షా కేంద్రాలల్లో సుమారు 200 మంది ఉపాధ్యాయులు, సిబ్బంది విధులు నిర్వహించనున్నారు.
మండల పరిధిలో.. పరీక్షా కేంద్రాలు
సికింద్రాబాద్ మండల పరిధిలో 17 పరీక్షా కేంద్రాల్లో నేటి నుంచి పరీక్షలు జరుగనున్నాయి. కీస్ హైస్కూల్ (సికింద్రాబాద్), సెయింట్ ఫ్రాన్సిస్ స్కూల్ (సికింద్రాబాద్), సెయింట్ ఆన్స్ స్కూల్ (సికింద్రాబాద్), సెయింట్ మేరీస్ స్కూల్ (సికింద్రాబాద్), సెయింట్ ఆథోని స్కూల్ (సికింద్రాబాద్) సెయింట్ ఫిలోమినా స్కూల్ ( బోయిగూడ), గుజరాతి ఎయిడెడ్ స్కూల్ (బైబుల్ హౌజ్), న్యూ బోయిగూడ ప్రభుత్వ పాఠశాల (న్యూ బోయిగూడ,) బన్సీలాల్పేట ప్రభుత్వ పాఠశాల (బన్సీలాల్పేట), పార్శి హైస్కూల్ (పార్కులైన్), ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాల బేగంపేట-2 ( బేగంపేట), సెయింట్ మార్క్ ప్రోగ్రసీ హైస్కూల్ (బేగంపేట), నల్లగుట్ట ఓల్డ్ బాలికల పాఠశాల (నల్లగుట్ట), మమతా హైస్కూల్ (బేగంపేట), మహర్షి విద్యానికేతన్ (బేగంపేట), గౌతం మోడల్ స్కూల్( చీకోటి గార్డెన్ బేగంపేట్), శ్రీ చైతన్య స్కూల్ (సికింద్రాబాద్ ఎంజీ రోడ్డు) పాఠశాల్లో పరీక్షలు నిర్వహించనున్నారు