జీడిమెట్ల, మే 22 : సుభాష్నగర్ డివిజన్ పరిధి వెంకటాద్రినగర్ కాలనీలో సీసీ రోడ్డు నిర్మాణ పనులు నిలిచిపొవడంతో స్థానిక ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. సీసీ రోడ్డు నిర్మాణ పనులు చేపట్టి నెలన్నర గడిచినా నిర్మాణ పనులు పూర్తి కాకపోవడంతో ఆ రోడ్డు మీదుగా రాకపోకలు సాగించాలంటే వాహనదారులు నానా అవస్థలు పడుతున్నారు. సంబంధిత కాంట్రాక్టర్ నిర్లక్ష్యం కారణంగా సీసీ రోడ్డు నిర్మాణ పనులు అసంపూర్తిగా నిలిచిపోయాయని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఈ విషయమై సంబంధిత ఇంజినీరింగ్ అధికారులకు ఫిర్యాదు చేసినప్పటికీ పట్టించుకోవడం లేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ఇంజినీరింగ్ అధికారులు స్పందించి నిలిచిపోయిన సీసీ రోడ్డు నిర్మాణ పనులను వెంటనే పూర్తి చేసి తమ ఇబ్బందులు తొలగించాలని వెంకటాద్రినగర్ బస్తీ వాసులు కోరుతున్నారు.
పనులు పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటాం:సురేందర్నాయక్, జీహెచ్ఎంసీ ఏఈ
వెంకటాద్రినగర్ కాలనీలో నిలిచిపోయిన సీసీ రోడ్డు నిర్మాణ పనుల విషయమై జీహెచ్ఎంసీ ఏఈ సురేందర్ నాయక్ను వివరణ కోరగా సీసీ రోడ్డు నిర్మాణ పనులు నిలిచిపోయింది వాస్తవమేనని,సంబంధిత కాంట్రాక్టర్పై చర్యలు తీసుకొని సీసీ రోడ్డు నిర్మాణ పనులు తిరిగి ప్రారంభమయ్యేలా చూస్తామని పేర్కొన్నారు.