అంబర్పేట/ కాచిగూడ, మే 21: రాజకీయాలకు అతీతంగా అంబర్పేట నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తానని కేంద్రమంత్రి కిషన్రెడ్డి అన్నారు. కాచిగూడ కార్పొరేటర్ ఉమాయాదవ్తో కలిసి శనివారం డివిజన్లోని పలు ప్రాంతాల్లో పాదయాత్ర నిర్వహించి, సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం బర్కత్పురలోని అంజయ్య పార్క్లో అధికారులతో సమావేశాన్ని ఏర్పాటు చేసి, మాట్లాడుతూ రాష్ట్రం సుభిక్షంగా ఉండలాంటే కాలు ష్య రహిత ప్రకృతిని అందించేందుకు పచ్చని చెట్లు ఎంతగానో ఉపయోగ పడుతాయని అన్నారు.
తెలంగాణ రా ష్ట్రం హరితహారంగా ఉండేందుకు ప్రతి ఒక్కరూ పార్కు ల్లో నాటిన మొక్కలను రక్షించుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. సెంట్రల్ జిల్లా అధ్యక్షుడు గౌతంరావు, మాజీ అధ్యక్షుడు వెంకట్రెడ్డి, కన్నె రమేశ్యాదవ్, డీఎంసీ వేణుగోపాల్, జలమండలి డీజీఎం సన్యాసిరావు, ఏఎంవోహెచ్ జ్యోతిబాయి, ఈఈ శంకర్, రామ్రెడ్డి, భాస్కర్, శేషునారాయణ, సతీశ్, గోపాల్రెడ్డి, బండారు సంతోష్కుమార్, సూర్యప్రకాశ్, మురళి, రాము, బాలప్రసాద్, భీంరాజ్, రవియాదవ్, రాజ్కుమార్ పాల్గొన్నారు.
అంబర్పేట నియోజకవర్గంలో సుడిగాలి పర్యటన..
అంబర్పేట : కేంద్ర సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రి జి. కిషన్రెడ్డి శనివారం అంబర్పేట నియోజకవర్గంలో సుడిగాలి పర్యటన నిర్వహించారు. ప్రజల సమస్యలు తెలుసుకునేందుకు వివిధ విభాగాల అధికారులతో కలిసి ఆయన నియోజకవర్గంలోని అన్ని డివిజన్లలో తిరిగారు. నల్లకుంట డివిజన్ సత్యానగర్, రత్నానగర్లో స్థానిక కార్పొరేటర్ వై. అమృతతో కలిసి పాదయాత్ర చేప ట్టి స్థానికుల సమస్యలు తెలుసుకున్నారు. అనంతరం బాగ్అంబర్పేట డివిజన్లోని రామకృష్ణనగర్ కమ్యూనిటీహాల్లో డివిజన్ కార్పొరేటర్ బి. పద్మవెంకటరెడ్డితో కలిసి ప్రజలతో ముఖాముఖి నిర్వహించారు.
అన్ని డివిజన్లలో ప్రజల నుంచి సమస్యలు తెలుసుకొని వాటి పరిష్కారానికి అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. రోడ్లు, డ్రైనేజీ, మంచినీరు వంటి మౌలిక సమస్యలను వెంటనే పరిష్కరించాలని అధికారులకు చెప్పారు. ఈ కార్యక్రమంలో బీజేపీ హైదరాబాద్ సెంట్రల్జిల్లా అధ్యక్షుడు డా.ఎన్. గౌతంరావు, వివిధ డివిజన్ల అధ్యక్షులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.