చిక్కడపల్లి, మే 21: వర్షాకాలానికి ముందే నాలా అభివృద్ధి పనులను పూర్తి చేయాలని అధికారులను ఎమ్మెల్యే ముఠా గోపాల్ ఆదేశించారు. శనివారం అడిక్మెట్ డివిజన్లోని పద్మ కాలనీలో కొనసాగుతున్న నాలా అభివృద్ధి పనులను ఆయన జీహెచ్ఎంసీ జోనల్ కమిషనర్ శ్రీనివాస్రెడ్డి, ఎస్ఎన్డీపీ ఎస్ఈ భాస్కర్రెడ్డి, ఈఈ శ్రీనివాస్ తదితర అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రాబోయే వర్షాకాలంలో వరదనీటి సమస్యలు రాకుండా అన్ని విధాలుగా చర్యలు తీసుకుంటున్నామని ఆయన తెలిపారు.
పద్మకాలనీలో కొనసాగుతున్న నాలా స్లాబ్ పనులు వేగవంతగా పూర్తి అయ్యే విధంగా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. నాలా పరీవాహక కాలనీలు, బస్తీల ప్రజలకు వరదనీటి వలన ముప్పు రాకుండా నాలా అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయని తెలిపారు. శాశ్వత పరిష్కారం దిశగా సమస్యను పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నట్లు ఎమ్మెల్యే ముఠా గోపాల్ తెలిపారు. అదే విధం గా అంజయ్యనగర్ బస్తీలో ఎమ్మెల్యే పర్యటించారు. టీఆర్ఎస్ పార్టీ యువజన విభాగం నాయకుడు ముఠా జయ సింహ, డీఈ సన్నీ, ఏఈ విషేశ్, టీఆర్ఎస్ పార్టీ నాయకులు ముచ్చకుర్తి ప్రభాకర్, డివిజన్ కార్యదర్శి సురేందర్, మాదవ్, నేత శ్రీను, రవి యాదవ్, మనోహర్, ప్రవీన్, బొట్టు శ్రీను, ప్రవీణ్, స్థానికులు పాల్గొన్నారు.
ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రత్యేక దృష్టి ..
నియోజకవర్గం పరిధిలోని ప్రజా సమస్యల పరిష్కారంతో పాటు, అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నట్లు ఎమ్మెల్యే ముఠా గోపాల్ తెలిపారు. శనివారం రాంనగర్ డివిజన్ బాగ్లింగంపల్లిలోని రాజీవ్గాంధీనగర్ బస్తీ, లంబాడితాండా బస్తీలలో ఎమ్మెల్యే బస్తీ బాటా కార్యక్రమాన్ని నిర్వహించారు. రాజీవ్గాంధీనరగ్ బస్తీలో ప్రజలను అడిగి సమస్యలు తెలుసుకున్నారు.తాగునీటితో పాటు వాడుకోవడానికి నీటి వసతి సదుపాయాలు కల్పించాలని, ఇంతుకు అవసరమైన బోర్వెల్, నీటి స్టోరేజ్ ట్యాంక్ ఏర్పాటు చేయాలని, కమ్యూనిటీ ల్ను అభివృద్ధి చేయాలని ఎమ్మెల్యేను కోరారు.
ఈ సమస్యలను తక్షణమే పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ స్థానిక బస్తీ ప్రజలు తీసుకొచ్చిన డ్రైనేజీ సమస్యల పరిష్కారం కోసం నూతన పైపులైన్ నిర్మాణానికి ప్రతిపాదనలు పెట్టాలని సంబంధిత అధికారులకు తెలిపారు. ఈ కార్యక్రమంలో రాంనగర్ డివవిజన్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఆర్. మోజస్, మన్నే దామోదర్రెడ్డి, బస్తీ సంఘం అధ్యక్షుడు సాబే, టీఆర్ఎస్ నాయకులు రమేశ్రెడ్డి, ఆర్.జయదేవ్, టెంపుల్ జనార్దన్, ఎం.వి. జనార్దన్, కొండమడుగు మధు, యాదవ్, బస్తీ మహిళలు , బస్తీ సంఘం అధ్యక్షుడు కల్యాణ్నాయక్, దేంవేందర్, కుమార్ పాల్గొన్నారు.