బండ్లగూడ, మే 21: బండ్లగూడ జాగీర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని ప్రజలకు ఆహ్లాదాన్ని అందించేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. పలు కాలనీలలో పార్కులను ఏర్పాటు చేస్తూ వాటిలో మొక్కలను నాటుతున్నారు. గతంలో ఉన్న పార్కులను అభివృద్ధి పరుస్తూ నిరంతరం వాటి సంరక్షణకు తగిన చర్యలు చేపడుతున్నారు. కాలనీ వాసు లు ఉదయం సాయంత్రం వేళ లో పార్కులో సేద తీరేందు కు తగిన ఏర్పాట్లను చేస్తున్నారు. పార్కుల్లో వాకిం గ్ ట్రాక్, పచ్చిక బైలు, సేద తీరేందుకు బల్లలు, ఇసుక, చిన్నారులు ఆడుకునేందుకు ఆట వస్తువులు వంటి వాటిని ఏర్పాటు చేస్తున్నారు. కార్పొరేషన్ పరిధిలో పది ప్రాంతాల్లో పార్కులను ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు చేస్తుండగా అందులో ఇప్పటి వరకు ఇండస్వ్యాలీ, కపిలానగర్, అభ్యుదయ నగర్, పద్మశ్రీహిల్స్ కాలనీలో పూర్తి కాగా శివసాయినగర్, ఫైన్ఆర్ట్స్ కాలనీ, ఆనంద్నగర్, పీఅండ్టీ కాలనీ, బృందావన్కాలనీ, తిరుమలహిల్స్ కాలనీలో పచ్చిక బైళ్లను ఏర్పాట్లు చేస్తున్నట్లు కమిషనర్ వేణుగోపాల్రెడ్డి తెలిపారు. దీంతో స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
ఆదర్శంగా తీర్చిదిద్దుతాం బండ్లగూడ జాగీర్ను ఆదర్శంగా తీర్చిదిద్దుతాం. కార్పొరేషన్ ప్రజలకు ఆహ్లాదాన్ని అందించేందుకు రూ.3 కోట్లతో పది పార్కులను అభివృద్ధి చేస్తున్నాం. పార్కులలో ప్రజలకు కావల్సిన మౌలిక వసతులను కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నాం.
–వేణుగోపారెడ్డి, కమిషనర్