అబిడ్స్, మే 18: గంజాయి నిల్వ చేసిన ప్రాంతాలపై దాడులు జరిపిన పోలీసులు ఒకరిని అరెస్ట్ చేయడంతో పాటు 2.86 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. హైదరాబాద్ డీపీఈఓ సీహెచ్.విజయ్ పర్యవేక్షణలో జాలిహనుమాన్ ప్రాంతంలో దాడులు నిర్వహించిన ఎక్సైజ్ పోలీసులు మనోజ్సింగ్ను అరెస్ట్ చేసి విచారించారు. తదుపరి విచారణ నిమిత్తం ధూల్పేట ఎక్సైజ్ పోలీసులకు అప్పగించారు.