ఖైరతాబాద్, మే 18 : చీటింగ్ కేసులో భార్యభర్తలకు రెండేండ్ల జైలు శిక్ష విధించారు. పంజాగుట్ట పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. శ్రీనగర్కాలనీలోని జ్యోతి ఎస్టేట్స్లో ఫ్లాట్ నం. 601లో నివాసం ఉండే జి. శ్రీనివాసరావు, జి. భారతిదేవి దంపతులు. 2010 ఆగస్టు 14న తమకు భూములు ఉన్నాయని, వాటిని డెవలప్మెంట్కు ఇస్తామని చెప్పి వంశీరామ్ బిల్డర్స్ మేనేజింగ్ పార్టనర్ బి. సుబ్బారెడ్డి వద్ద ఒకసారి రూ. 2 కోట్లు, మరోసారి రూ.4 కోట్లు తీసుకున్నారు. కాగా వారు ఎంతకూ స్థలాన్ని చూపించకపోవడంతో బాధితుడు దానిపై విచారణ చేయగా, ఆ భూములు అప్పటికే ఓ బ్యాంకులో తనఖా పెట్టి డబ్బులు తీసుకున్నట్లు తెలుసుకున్నారు. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేయగా, నిందితులిద్దరినీ కోర్టులో ప్రవేశపెట్టారు. సుదీర్ఘ విచారణ అనంతరం దంపతులకు 14వ అడిషనల్ చీఫ్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ ఎంకే పద్మావతి రెండు సంవత్సరాల సాధారణ జైలు శిక్ష, వెయ్యి రూపాయల జరిమానా విధిస్తూ తీర్పునిచ్చారు.