కుత్బుల్లాపూర్, మే 18 : ప్రజా సమస్యల పరిష్కారం కోసం అన్ని రకాల చర్యలు తీసుకుంటానని కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ అన్నారు. బుధవారం పేట్ బషీరాబాద్లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నియోజకవర్గానికి చెందిన ప్రజలు, ఆయా కాలనీల అసోషియేషన్ ప్రతినిధులు ఎమ్మెల్యేను మర్యాదపూర్వకంగా కలిసి తమ సమస్యలను విన్నవించుకున్నారు.
కాలనీలో మౌలిక సదుపాయాల కల్పనకు కృషి
గాజులరామారం, మే 18 : కాలనీలో మౌలిక సదుపాయాలు కల్పించేలా కృషి చేస్తానని కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కె.పి.వివేకానంద్ అన్నారు. బుధవారం గాజులరామారం డివిజన్ పరిధిలోని మహదేవపురం ఏడీఈఎఫ్సీ బ్లాక్లకు చెందిన సంక్షేమ సంఘాల సభ్యులు ఎమ్మెల్యేను ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం కాలనీలో భూగర్భ డ్రైనేజీ, సీసీ రోడ్లు ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకోవాలని కోరుతూ ఎమ్మెల్యేకు వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో అసొసియేషన్ సభ్యులు జగదీశ్వర్రెడ్డి, ప్రభాకర్, సురేశ్, నరెందర్, శేఖర్, రంగారావు, సుధాకర్, వెంకట్రెడ్డి, దుర్గారావు, మల్లారెడ్డి, సాంబశివరావు, సురేశ్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ప్రభాకర్ సేవలు చిరస్మరణీయం
జీడిమెట్ల, మే 18 : రంగారెడ్డినగర్ డివిజన్ ఏపీహెచ్బీకాలనీ మాజీ అధ్యక్షుడు స్వర్గీయ ప్రభాకర్గౌడ్ కాలనీకి చేసిన సేవలు చిరస్మరణీయమని ఎమ్మెల్యే కె.పి.వివేకానంద్ అన్నారు. బుధవారం ప్రభాకర్గౌడ్ ప్రథమ వర్ధంతి సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయనతోపాటు స్థానిక కార్పొరేటర్ బి.విజయ్శేఖర్గౌడ్ చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈకార్యక్రమంలో ప్రభాకర్గౌడ్ కుమారుడు సతీశ్గౌడ్, డివిజన్ టీఆర్ఎస్ అధ్యక్షులు ఎర్వ శంకరయ్య, నాయకులు కార్తీక్, సాయికిరణ్ తదితరులు పాల్గొన్నారు.