మాదాపూర్, మే 18: కరోనా విపత్కర పరిస్థితుల్లో సైతం అభివృద్ధి ఆగకూడదనే ఉద్ధేశ్యంతో ముఖ్యమంత్రి కేసీఆర్ అనేక సంక్షేమం, అభివృద్ధి పథకాలను ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడం గొప్ప విషయమని ఎమ్మెల్యే, విప్ అరెకపూడి గాంధీ అన్నారు. మాదాపూర్ డివిజన్ పరిధిలోని ఆదిత్యానగర్, గోకుల్ ప్లాట్స్, ఇజ్జత్నగర్, సైబర్హిల్స్, చందనాయక్ తండా, సర్వే ఆఫ్ ఇండియా, దోబీఘాట్లో రూ.3 కోట్ల 5 లక్షల 90వేల అంచనా వ్యయంతో, హఫీజ్పేట్ డివిజన్ పరిధిలోని మియాపూర్, ఇంజినీర్స్ ఎన్క్లేవ్, గంగారం, సుభాష్చంద్రబోస్ నగర్ కాలనీలో రూ.1 కోటి 70 లక్షల వ్యయంతో చేపట్టనున్న సీసీ రోడ్లు, వరద నీటి కాలువ అభివృద్ధి పనులను కార్పొరేటర్లు వి. జగదీశ్వర్ గౌడ్, వి.పూజిత గౌడ్లతో పాటు స్థానిక పార్టీ నాయకులతో కలిసి శంకుస్థాపనలు చేశారు. అభివృద్ధి విషయంలో ప్రభుత్వం చిత్తశుద్ధితో వ్యవహరిస్తూ ముందుకు సాగుతున్నట్లు తెలిపారు. శేరిలింగంపల్లి నియోజకవర్గాన్ని అన్ని విధాల అభివృద్ధి చేసి ఆదర్శవంతంగా తీర్చిదిద్దుతానని అన్నారు.
3 కోట్లతో అభివృద్ధి కార్యక్రమాలు..
మాదాపూర్ డివిజన్ పరిధిలోని ఆదిత్యానగర్లో రూ.75 లక్షల వ్యయంతో సీసీ రోడ్డు నిర్మాణ పనులు, గోకుల్ ప్లాట్స్లో రూ.97 లక్షల వ్యయంతో సీసీ రోడ్డు నిర్మాణ పనులు, ఇజ్జత్ నగర్లో రూ.20 లక్షలతో సీసీ రోడ్డు నిర్మాణ పనులు, సర్వే ఆఫ్ ఇండియా, దోబీఘాట్, చందానాయక్తండాలో రూ.63 లక్షల వ్యయంతో సీసీ రోడ్డు నిర్మాణ పనులు, సైబర్ హిల్స్ కాలనీలో రూ.50 లక్షల వ్యయంతో సీసీ రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపనలు చేశారు.
డివిజన్ పరిధిలో రూ. 1కోటి 70 లక్షలతో..
మియాపూర్లోని ప్రధాన రహదారిలో ఉన్నటువంటి కేఎస్ బేకరీ నుంచి సితార గ్రాండ్ హోటల్ వరకు రూ. 1 కోటి వ్యయంతో స్ట్రామ్ వాటర్ డ్రైన్ (వరద నీటి కాలువ) పనులు, ఇంజినీర్స్ ఎన్క్లేవ్లో రూ.30 లక్షల వ్యయంతో సీసీ రోడ్డు నిర్మాణ పనులు, గంగారంలో రూ.25 లక్షల వ్యయంతో సీసీ రోడ్డు నిర్మాణ పనులు, సుభాష్చంద్రబోస్ నగర్లో రూ.15 లక్షల వ్యయంతో సీసీ రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపనలు చేశారు. ఈ కార్యక్రమంలో మాదాపూర్ డివిజన్ టీఆర్ఎస్ అధ్యక్షుడు ఎర్రగుడ్ల శ్రీనివాస్ యాదవ్, మాదాపూర్ డివిజన్ టీఆర్ఎస్ గౌరవ అధ్యక్షుడు శ్రీనివాస్ గౌడ్, బ్రిక్ శ్రీనివాస్, గుమ్మడి శ్రీనివాస్, రాంచందర్, సయ్యద్ గౌస్, మునఫ్ ఖాన్, ఖాసీం, లియాకత్, రహీం, లాలూ నాయక్, అప్పారావు, సలీం, షోయబ్, సాంబయ్య, వెంకట్రామిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.