శంషాబాద్ రూరల్, మే 18 : రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పట్టణ ప్రగతిలో భాగంగా శంషాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని ఎయిర్పోర్టు కాలనీలో ఏర్పాటు చేసిన పార్కు పచ్చనిచెట్లతో కళకళళాడుతున్నది. పట్టణ ప్రగతిలో భాగంగా స్థానిక కౌన్సిలర్ అమృతారెడ్డి ఆధ్వర్యంలో 300 పైగా మొ క్కలు నాటడంతో అవి పెరిగి నేడు పార్కు చెట్లతో నిండిపోయింది. ఔటర్రింగ్ రోడ్డు నుంచి కాలనీకి వెళ్లే ప్రధాన మార్గం లో తెలంగాణ తల్లి, జయశంకర్సార్ విగ్రహాలతో పాటు అమరవీరుల స్తూపం ఏర్పాటు చేశారు.
దీంతో ఈ ప్రాంతం మరింత అందంగా కనిపిస్తున్నది. గత సంవత్సరం నిర్వహించిన పట్టణ ప్రగతిలో భాగంగా ఓపెన్ జిమ్ ఏర్పాటు చేయడంతో పాటు హరితహారంలో మొక్కలు నాటారు. దీంతో ఎయిర్పోర్టు కాలనీకి ముఖద్వారం వద్ద పచ్చని చెట్లు పచ్చ దనంతో కనువిందు చేస్తున్నాయి. పార్కులో ఉదయం, సాయంత్రం వందలాది మంది వాక్సింగ్ చేయడానికి వస్తుంటారు. చెట్లు పెంచడంతో వారికి ఉపయోగకరంగా మారింది. శంషాబాద్ పట్టణంలోనే 25 వార్డులలలో చూపరులను అకట్టుకునే విధంగా ఎయిర్పోర్టు కాలనీ ఉందని స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు కలలు కన్నవిధంగా శంషాబాద్ పట్టణంలోని 15వ వార్డులో పార్కును తయా రు చేశామని అధికారులు, ప్రజాప్రతినిధులు పేర్కొంటున్నారు.
పార్కును మరింత అభివృద్ధి చేస్త
సీఎం కేసీఆర్ కలలు కన్న విధంగా ఎయిర్పోర్టు కాలనీ పార్కును అభివృద్ధి చేశాం. పట్టణ ప్రగతిలో భాగంగా ఓపెన్ జిమ్తో పాటు హరితహారంలో మొక్కలు నాటడంతో ఇది సాధ్యమైంది. పార్కును మరింత అభివృద్ధి చేస్త.
– అమృతారెడ్డి కౌన్సిలర్ శంషాబాద్