బడంగ్పేట, మే 18: దశలవారీగా అభివృద్ధి పనులు చేపడుతూ.. బడంగ్పేట్ మున్సిపాలిటీ కార్పొరేషన్ను అన్ని విధాలుగా అభివృద్ధి పరుస్తున్నామని మేయర్ చిగిరింత పారిజాత నర్సింహారెడ్డి పేర్కొన్నారు. బుధవారం 12వ డివిజన్లో తాగునీటి పైపులైన్ నిర్మాణ పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. మంత్రి సబితాఇంద్రారెడ్డి నేతృత్వంలో మున్సిపల్ కార్పొరేషన్లు అభివృద్ధి జరుగుతున్నాయని తెలిపారు. ఇంటింటికీ మంచినీరు అందజేయాలని మొదటి ప్రాధాన్యతగా తాగునీటి పనులను ప్రారంభించడం జరగిందన్నారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ యాతం పవన్కుమార్, సుక్క శివకుమార్, నాయకులు తదితరులు పాల్గొన్నారు.