ఉప్పల్, మే 18 : కాలనీల సమగ్రాభివృద్ధికి కృషి చేస్తున్నామని ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్రెడ్డి అన్నారు. పట్టణ ప్రగతిపై ఉప్పల్ సర్కిల్ కార్యాలయంలో అధికారులు, కార్పొరేటర్లతో బుధవారం ఎమ్మెల్యే సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కాలనీలు అభివృద్ధిపర్చడంతోపాటు పరిశుభ్రంగా ఉండేలా అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేయాలన్నారు. బస్తీలు, కాలనీల్లో పరిశుభ్రత, పచ్చదనం కోసం తగిన ప్రణాళికలు రూపొందించాలన్నారు. కాలనీలో అధికారులు పర్యటించి, సమస్యలు గుర్తించి, తగిన చర్యలు తీసుకుంటారన్నారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు బన్నాల గీతాప్రవీణ్ ముదిరాజ్, బండారి శ్రీవాణి వెంకటరావు, డిప్యూటీ కమిషనర్ అరుణకుమారీ, ఈఈ నాగేందర్, నేతలు జనుంపల్లి వెంకటేశ్వర్రెడ్డి, గడ్డం రవికుమార్, గరిక సుధాకర్, బన్నాల ప్రవీణ్, వేముల సంతోష్రెడ్డి, అన్య వెంకటేశ్, పల్లె నర్సింగ్రావు, పిట్టల నరేశ్, కొండల్రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
క్రికెట్, వాలీబాల్ పోటీలు ప్రారంభం
ఉప్పల్ మున్సిపల్ స్టేడియంలో వేసవి శిక్షణ శిబిరాల్లో భాగంగా క్రికెట్, వాలీబాల్ పోటీలను బుధవారం ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్రెడ్డి, కార్పొరేటర్ బన్నాల గీతాప్రవీణ్, డిప్యూటీ కమిషనర్ అరుణకుమారి హాజరై మాట్లాడారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ క్రీడాకారులు వేసవి శిక్షణ శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
‘పట్టణ ప్రగతి’ని విజయవంతం చేద్దాం..
కాప్రా, మే 18 : అన్ని కాలనీలను, నివాస ప్రాంతాలను సమస్యలులేని కాలనీలు, ప్రాంతాలుగా తీర్చిదిద్ది వాటిని సమగ్రంగా అభివృద్ధి చేసేందుకే సీఎం కేసీఆర్ పట్టణప్రగతి కార్యక్రమాన్ని చేపట్టారని, ఈ కార్యక్రమం విజయవంతం చేసేందుకు అందరూ సహకరించాలని ఉప్పల్ ఎమ్మెల్యే బేతిసుభాష్రెడ్డి అన్నారు. బుధవారం కాప్రా సర్కిల్ కార్యాలయంలో కార్పొరేటర్లు,అధికారులతో త్వరలో చేపట్టబోయే పట్టణ ప్రగతి కార్యక్రమంపై సమీక్షా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ..అన్ని డివిజన్ల పరిధిలోని కాలనీల్లో మౌలిక సదుపాయాల కల్పన, సమస్యలులేని కాలనీలుగా తీర్చిదిద్దాల న్నారు. ఇంజినీరింగ్, టౌన్ప్లానింగ్, శానిటేషన్, యూసీడీ తదితర అన్ని విభాగాల అధికారులు సమన్వయంతో వ్యవహరించి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. సర్కిల్ డిప్యూటీ కమిషనర్ ఎన్.శంకర్, కార్పొరేటర్లు జెర్రిపోతుల ప్రభుదాస్, పన్నాల దేవేందర్ రెడ్డి, ఏఎంఓహెచ్ డాక్టర్ శ్రీనివాస్, డీఈఈ శ్రీరాములు, ఏఎంసీ నాగేందర్ , ప్రాజెక్టు అధికారి ఉషా, డీఏఓ భాస్కర్, ఏఈఈలు, సిబ్బంది పాల్గొన్నారు.