హయత్నగర్, మే 17: పెద్దఅంబర్పేటలో ఓ ప్రైవేట్ స్కూల్ బస్సు బీభత్సం సృష్టి ంచింది. బ్రేకులు ఫెయిలై స్కూల్ బస్సు సెక్యూరిటీ గార్డుపైకి దూసుకెళ్లడంతో తీవ్రంగా గాయపడ్డాడు. హయత్నగర్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అబ్దుల్లాపూర్మెట్ మండలం, పెద్దఅంబర్పేట మున్సిపాలిటీ లక్ష్మారెడ్డిపాలెంలోని ఓ ప్రైవేట్ స్కూల్లో టెన్త్ (సీబీఎస్ఈ) పరీక్షలు జరుగుతున్నాయి. ఉదయం పూట స్కూల్ బస్సు బ్రేకులు ఫెయిలై కావడంతో సెక్యూరిటీ గార్డు తోట ప్రభాకర్(50)పైకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో ప్ర భాకర్కు తీవ్ర గాయాలు కాగా ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. విద్యార్థులందరూ స్కూల్ గదుల్లోకి వెళ్లిపోవడంతో పెను ప్రమాదం తప్పిందని స్థానికులు అభిప్రాయపడ్డారు.