సుల్తాన్బజార్, మే 17 : షార్ట్ సర్క్యూట్ కారణంగా ఓ ఉమెన్స్వేర్ ఆల్ట్రేషన్ వర్క్షాపులో అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ సంఘటన సుల్తాన్బజార్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకున్నది. ఎస్ఐ ప్రేమ్ తెలిపిన వివరాల ప్రకారం… బడీచౌడీ ప్రాంతంలోని జీ ప్లస్ 3 భవనంలో మోహిద్ షరీఫ్ అనే వ్యక్తి సనాలి ఉమెన్స్ వేర్ నిర్వహిస్తున్నాడు. కాగా భవనంలోని కింది అంతస్తులో షాపు నిర్వహిస్తుండగా రెండవ అంతస్తులో ఆల్ట్రేషన్ వర్క్ షాప్ కొనసాగుతున్నది. ఇదిలా ఉండగా మంగళవారం సాయంత్రం ఎవరూ లేని సమయంలో రెండవ అంతస్తులో మంటలు చెలరేగాయి. సీసీ టీవీ కెమెరాలలో గుర్తించిన యజమాని పోలీసులకు, అగ్నిమాపక శాఖ అధికారులకు సమాచారం అందించాడు. వెంటనే అక్కడికి చేరుకున్న గౌలిగూడ ఫైర్ స్టేషన్ అధికారి ప్రవీణ్కుమార్ తమ బృందంతో మంటలను ఆర్పివేశారు. ఈ ప్రమాదంలో రెండవ అంతస్తులోని వర్క్షాప్లో నాలుగు కుట్టు మిషన్లు, రెడీమెడ్ దుస్తులు, వినియోగదారులు ఆల్ట్రేషన్ కోసం ఇచ్చిన దుస్తులు, క్లాత్, అమర్చేందుకు తీసుకువచ్చిన నాలుగు ఏసీలు దగ్ధమయ్యాయి. సుమారు లక్ష రూపాయలకు పైగా ఆస్తి నష్టం జరిగి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు.