బన్సీలాల్పేట్, మే 17 : సనత్నగర్ నియోజకవర్గ ప్రజలు ఎదుర్కొంటున్న దీర్ఘకాల సమస్యలను పరిష్కరించామని రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ అన్నారు. మంగళవారం బన్సీలాల్పేట్ కార్పొరేటర్ కే హేమలత, పలు అధికారులతో కలిసి న్యూబోయిగూడలోని ఉప్పలమ్మ గుడి నుంచి గొల్లకొమరయ్య కాలనీ మీదుగా భోలక్పూర్ వరకు రూ.1.59 కోట్ల వ్యయంతో ఏర్పాటు చేస్తున్న వైట్ టాపింగ్ రోడ్డు నిర్మాణ పనులను ఆయన పరిశీలించారు. జీహెచ్ఎంసీ, జలమండలి శాఖల అధికారుల సమన్వయంతో పనిచేయాలని, రోడ్డు వేయడానికి ముందే డ్రైనేజీ పైపులైన్ పనులను పూర్తి చేయాలని మంత్రి సూచించారు. ఎన్ని కోట్ల రూపాయల ఖర్చు అయినా అభివృద్ధి పనులు పూర్తి చేస్తామని అన్నారు. మరిన్ని పనులు మంజూరయ్యాయని, త్వరలోనే వాటిని మొదలుపెడతామని తెలిపారు. ఈ కార్యక్రమంలో జలమండలి జీఎం రమణారెడ్డి, డీజీఎం వెంకట్రావ్, జీహెచ్ఎంసీ అధికారులు ఆంజనేయులు, ప్రవీణ్, క్రిస్టఫర్, సికింద్రాబాద్ తాసీల్దార్ బాలశంకర్, టీఆర్ఎస్ నాయకులు జీ పవన్కుమార్గౌడ్, కే లక్ష్మీపతి, వెంకటేశన్రాజు, ఏసూరి మహేశ్, రాజేందర్, లంబుశ్రీను, కుమార్యాదవ్, కరీమ్, రజాక్, అబ్బాస్, శరీఫ్, ముకర్రమ్, నాగలక్ష్మి, కౌసల్య, జీకే కాలనీ అధ్యక్షుడు కేఎం.కృష్ణ, కార్యదర్శి నర్సింగ్రావు, మనీశ్కుమార్, వినోద్ పాల్గొన్నారు.