శంషాబాద్ రూరల్, మే 17 : శంషాబాద్ మున్సిపాలిటీని ఆదర్శవంతంగా తీర్చిదిద్దుతామని చైర్పర్సన్ సుష్మ అన్నారు. మంగళవారం శంషాబాద్ మున్సిపల్ 24వ వార్డు కౌన్సిలర్ కొన్నమొల్ల భారతమ్మతో పాటు పలువురు నాయకులు చైర్పర్సన్ సుష్మను కలిసి శంషాబాద్ మున్సిపల్ అభివృద్ధిపై చర్చించారు. ఈ సందర్భంగా సుష్మ మాట్లాడుతూ.. శంషాబాద్ మున్సిపాలిటీని జిల్లాలోనే ఆదర్శవంతంగా తయారు చేస్తానని అందుకు ప్రజా ప్రతినిధులు, అధికారులు, ప్రజలు పూర్తిస్థాయిలో సహకరించాలని కోరారు. పట్టణంలో పారిశుధ్యంతో పాటు పట్టణ ప్రగతిలో హరితహారం విజయవంతం చేయడంతో మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్గారు అవార్డు అందజేశారని ఆమె తెలిపారు. కార్యక్రమంలో నార్సింగి మార్కెట్ కమిటీ చైర్మన్ వెంకటేశ్ గౌడ్, పార్టీ లీగల్సేల్ అధ్యక్షుడు కొన్నమొల్ల శ్రీనివాస్, పరంధాములు, పాండురంగారెడ్డి, దర్శన్, కృష్ణారెడ్డి, వెంకటేశ్, అమరేందర్రెడ్డిలతో పాటు పలువురు నాయకులు పాల్గొన్నారు.