కీసర, మే 17: గోధుమకుంటలోని ప్రతి ఇంటిని, ఖాళీ స్థలాలను డ్రోన్ కెమెరాల సహాయంతో సర్వే చేయిస్తున్నామని జిల్లా పంచాయతీ అధికారి రమణమూర్తి తెలిపారు. కేంద్ర ప్రభుత్వ సర్వే ఆఫ్ ఇండియా సంస్థ ద్వారా సర్వే ఆఫ్ విలేజ్ అండ్ మ్యాపింగ్ విత్ ఇంపోర్టెడ్ టెక్నాలజీ విలేజ్ ఏరియా సర్వే చేస్తున్నారు. మండలంలోని గోధుమకుంట గ్రామాన్ని పైలెట్ ప్రాజెక్ట్ విలేజ్గా ఎంపిక చేశారు. మంగళవారం డ్రోన్ కెమెరాతో గ్రామంలోని ప్రతి ఇంటిని, ఖాళీ స్థలాలను సర్వే చేశారు. ఈ సందర్భంగా జిల్లా పంచాయతీ అధికారి మాట్లాడుతూ.. ప్రభుత్వ ఆదేశానుసారంగా గోధుమకుంటలోని ప్రతి స్థలాన్ని, ఇంటిని సర్వే చేసి ప్రభుత్వానికి నివేదిక అందజేస్తామని తెలిపారు. ఈ సర్వే ద్వారా గ్రామ కంఠానికి సంబంధించిన భూమి వివరాలు కూడా నమోదు అవుతాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ ఆకిటి మహేందర్రెడ్డి, ఉప సర్పంచ్ సోమని ఆంజనేయులు, పంచాయతీరాజ్ ఎంపీడీవో ఆఫీస్ కమిషనర్ హరీశ్ కుమార్, సర్వే ఆఫ్ ఇండియా బృందం, పంచాయతీ కార్యదర్శి బి. సురేశ్రెడ్డి, ఎంపీటీసీ మంచాల కిరణ్జ్యోతి, పంచాయతీ సభ్యులు, గ్రామపెద్దలు తదితరులు పాల్గొన్నారు.