నేరేడ్మెట్ , మే17 : మల్కాజిగిరి నియోజకవర్గ అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తున్నామని మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు అన్నారు. మంగళవారం యాప్రాల్ నాగిరెడ్డి చెరువు నుంచి కాప్రా చెరువు వరకు రూ.41కోట్లతో చేపట్టిన బాక్స్ డ్రైనేజీ పనులను స్థానిక కార్పొరేటర్ మీనా ఉపేందర్రెడ్డి, వివిధ శాఖల అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు మాట్లాడుతూ వర్షాకాలంలోపు బాక్స్ డ్రైనేజీ నిర్మాణ పనులను పూర్తి చేసేలా కృషి చేయాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. స్థానికులకు ఎలాంటి ఇబ్బందులు జరగకుండా వేగంగా పూర్తి చేయాలని తెలిపారు. ఈకార్యక్రమంలో జీడ్సీ శ్రీనివాస్రెడ్డి, డీసీ రాజు, ఎస్ఎన్డీపీ ఎస్సీ కిషన్, అల్వాల్ తహసీల్దార్ నాగమణి, డీఈ మహేష్, డీఈ నీటిపారుదలశాఖ పవన్, డీసీపీ గజానంద్, ఏఈ సృజన, కార్పొరేటర్లు ప్రేంకుమార్, మాజీ కార్పొరేటర్ జగదీష్గౌడ్, జీవగన్, బద్దం పరశురాంరెడ్డి, మల్కాజిగిరి సర్కిల్ ఉపాధ్యక్షుడు ఉపేందర్రెడ్డి, పట్ల శ్రీనివాస్, జీఎన్వీ సతీష్, గుండా నిరంజన్, ఎస్ఆర్ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.