కాప్రా, మే 17: కాప్రా డివిజన్ వంపుగూడ గోపాల్రెడ్డినగర్లో మూడురోజులపాటు నిర్వహించిన శ్రీనృసింహస్వామి జయంతి ఉత్సవాలు మంగళవారం ఘనంగా ముగిశాయి. శ్రీమద్భగవాద్రామానుజ రుగ్వేద పాఠశాల నిర్వాహకులు, యాదాద్రి పూర్వ ప్రధానార్చకులు సందుగుల రాఘవచార్యులు ఆధ్వర్యంలో జరిగిన ఈ ఉత్సవాల్లో భాగంగా ధ్వజారోహణం, వేద విధ్వత్సభ, చతుర్వే శ్రవణం, గోష్ఠి, నృసింహ స్వామి స్తంభావిష్కరణ, నక్షత్ర హారతి, శ్రీనృసింహ స్వామి కల్యాణం నిర్వహించారు. ముఖ్యఅతిథులుగా సీతారంబాగ్ పీఠం అధిపతులు శ్రీమాన్ వ్రతధర రామానుజ జీయర్స్వామి, భద్రాచల స్థానాచార్యులు డాక్టర్ కేఈ స్థలశాయి, ఎస్వీ యూనివర్సిటీ ఆచార్యులు పురుషోత్తమాచార్యులు పాల్గొన్నారు. రచయిత పురాణపండ శ్రీనివాస్ రచించిన శ్రీమాలిక పుస్తకాన్ని వ్రతాధర రామానుజ జీయర్ స్వామి వారు ఆవిష్కరించారు. గోపాల్రెడ్డినగర్ సంఘం ప్రతినిథులు శ్రీహరి, ఎం.ఎస్.కుమార్, డాక్టర్ సుధీర్, పద్మలత, ప్రవీణ్ పాల్గొన్నారు.